తెరమీద ఆయన చూపిన బొమ్మ.. భారతీయ సినిమాకు ప్రాణం పోసింది..!

Publish Date:Feb 15, 2025

Advertisement

 


దాదాసాహెబ్  ఫాల్కే అవార్డ్.. చాలా మంది నటుల కల ఇది.  భారతీయ చలనచిత్ర పితామహుడిగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే గుర్తుగా, ఆయన గౌరవార్థం ఈ అవార్డును ఎంపిక చేసిన నటులకు ఇస్తుంటారు.   చలనచిత్ర పరిశ్రమలో దాదాసాహెబ్ తిరుగులేని వ్యక్తి. ఆయన భారతీయ సినిమాను విప్లవాత్మకంగా మార్చారు.  భవిష్యత్ చిత్రనిర్మాతలకు సృజనాత్మక నైపుణ్యాన్ని అందివ్వడంలోనూ,  చలనచిత్ర రంగాన్ని అబివృద్ది చేయడానికి తగిన అణ్వేషనలు జరపడంలోనూ ఈయన వేసిన మొదటి అడుగే తదుపరి వారికి మార్గం చూపింది.  ఫిబ్రవరి 16 వ తేదీన దాదాసాహెబ్ ఫాల్కే మరణించారు.  ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు,  విశేషాలు తెలుసుకుంటే..

 దుండిరాజ్.. దాదాసాహెబ్..

దాదాసాహెబ్ ఫాల్కేగా ప్రసిద్ధి చెందిన ఈయన అసలు పేరు  ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఏప్రిల్ 30, 1870న మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. ఆయనకు చిన్నప్పటి నుంచీ కళలపై ఆసక్తి ఉండేది.   ఈయన చాలా కళలు అభ్యసించారు. విద్య పూర్తి చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ గానూ,  డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేయడం ప్రారంభించారు. తరువాత ఫాల్కే ప్రింటింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టి బొంబాయిలో  తన సొంత ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించారు. ఈ అనుభవం ఆయన భవిష్యత్ చిత్రనిర్మాణ వృత్తిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.


ఆసక్తికర ప్రయాణం..

1911లో ఫాల్కే "ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్" అనే మూకీ చిత్రాన్ని చూశారు. ఇది  ఆయన జీవితాన్ని మార్చేసింది.  చిత్రకళతో ఆయనకు సంబంధం దీని వల్లనే ఏర్పడింది. ఆ చిత్రం ఆయనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.  చిత్రనిర్మాణంపై ఆయన మక్కువను రేకెత్తించింది.  ఈ ఆకర్షణ, ఈ ఆసక్తితోనే ఆయన చిత్రనిర్మాణంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో భారతదేశంలో చిత్రనిర్మాణానికి సౌకర్యాలు,  మౌలిక సదుపాయాలు లేవు. అయినా సరే  నిరుత్సాహపడకుండా ఫాల్కే చిత్రనిర్మాణ పద్ధతులు,  పరికరాల గురించి మరింత తెలుసుకోవడానికి లండన్‌కు వెళ్లారు. ఆయన సంపాదించిన  జ్ఞానం, చిత్రనిర్మాణంపై ఆయనకున్న  దృఢ సంకల్పంతో దేశంలో చలనచిత్ర నిర్మాణాన్ని స్థాపించాలనే  లక్ష్యంతో  భారతదేశానికి తిరిగి వచ్చారు.

భారతదేశంలో సవాళ్లు..

1920,  1930లలో దాదాసాహెబ్ ఫాల్కే ఆర్థికంగానూ,  సాంకేతికంగానూ  చాలా సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఈ అడ్డంకులు ఆయనను చిత్రనిర్మాణంపై తనకున్న మక్కువను ఆపలేకపోయాయి. ఫాల్కే 1913లో విడుదలైన భారతదేశపు మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం " రాజా హరిశ్చంద్ర "తో సహా అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సంచలనాత్మక చిత్రం భారతీయ సినిమా ప్రారంభానికి నాంది పలికింది.  భవిష్యత్ చిత్రనిర్మాతలు వారిలో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి   పునాది వేసింది.

మరణం.. వారసత్వం..

దాదా సాహెబ్ ఫాల్కే ఫిబ్రవరి 16, 1944న మరణించారు. ఆయన ఒక అద్భుతమైన వారసత్వాన్ని భారతదేశానికి అందించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషి  గుర్తుగా నేటికీ ఆయన మరణాన్ని,  జయంతిని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్థాపించింది.  భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు వారి అత్యుత్తమ సేవలకు ఇచ్చే అత్యున్నత గౌరవాలలో ఇది ఒకటి. ఫాల్కే మార్గదర్శక ప్రయత్నాలు భారతీయ చలనచిత్ర పరిశ్రమను స్థాపించడమే కాకుండా  భారతీయ సాంస్కృతికతను,  భారతీయ విలువలను ప్రజలకు తెలిజేయడంలో సహాయపడ్డాయి. ఇప్పటికాలంలో సినిమా అనేది చాలా శక్తివంతమైన సాధనంగా మారడం వెనుక దాదాసాహెబ్ కృషి, ఆయన వేసిన మొదటి అడుగు ఉన్నాయి.  భారతీయ విలువలను పరిరక్షించడానికి,  ప్రోత్సహించడానికి సహాయపడే భారతీయ పురాణాలు, ఇతిహాసాలు,  కథలను ఆయన సినిమాలుగా రూపొందించారు.

అంతిమంగా..

ప్రింటింగ్ ప్రెస్ యజమాని నుండి భారతీయ సినిమా పితామహుడిగా మారే వరకు దాదాసాహెబ్ ఫాల్కే ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన అంకితభావం, అభిరుచి,  దార్శనికత నేడు మనకు తెలిసిన భారతీయ చిత్ర పరిశ్రమకు పునాది వేసింది.    తెర మీద ఆయన చూపిన బొమ్మ దాదాసాహెబ్ చేసిన మ్యాజిక్కే..!


                           *రూపశ్రీ.

By
en-us Political News

  
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.