Publish Date:Oct 30, 2020
కామారెడ్డి జిల్లాలో సన్నరకం వరికి తెగులు సోకి పంట మొత్తం నాశనం కావడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు. చేతికొచ్చిన వరి పంటకు దోమపోటు సోకడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పండిన పంట నెలకొరగడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని దిగాలు పడిన రైతులు పంటకు నిప్పు పెడుతున్నారు. రాజంపేట్ మండలం.. ఎల్లారెడ్డి పల్లి తండా కు చెందిన రైతులు బాబూలాల్, శ్రీనివాస్ లు చెరి రెండు ఎకరాల సన్నరకం వరి సాగు చేశారు. అయితే దోమపోటుతో గింజ కూడా రాకపోవడంతో వరి పంటకు నిప్పంటించారు. దీంతో వేల రూపాయల నష్టం వాటిల్లిందని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరో పక్క లింగంపేట్ మండలంలో సన్నరకం వరి 6000 ఎకరాలలో సాగు చేయగా దాదాపు 2000 ఎకరాలకు పైగా దోమపోటు, అగ్గి తెగులు సోకాయి. ఒకపక్క మార్కెట్ లో సన్నరకం వరికి మద్దతు ధర లేకపోగా.. మరోపక్క దోమపోటు, తెగుళ్లు సోకడంతో కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం చామన్ పల్లికి చెందిన రైతు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో తన రెండెకరాల పొలంలో దొడ్డు రకం వరి సాగు చేయగా లాభలు వచ్చాయని.. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ సారి సన్న రకం వరి సాగు చేయగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటపొలంలో వర్షం నీరు నిలిచింది. దీంతో వరిపంట దోమపోటుకు గురై ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట వస్తుందని భావించిన రైతు తీవ్ర మనస్థాపానికి గురై.. ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా.. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. రైతన్నల బతుకులు మాత్రం మారడం లేదు. వర్షాలు లేక కొన్ని సార్లు, వర్షాలు ఎక్కువై కొన్ని సార్లు పంట చేతికి రాక పెట్టుబడులు కూడా పోగొట్టుకుంటున్నారు. తాను పండించే పంటను పసిపాపలా భావించి.. కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాత ఆ పంటకు తానే నిప్పు పెట్టడం అత్యంత విషాదకరం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-in-telangana-burning-crop-25-105756.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.