Publish Date:Oct 30, 2020
కామారెడ్డి జిల్లాలో సన్నరకం వరికి తెగులు సోకి పంట మొత్తం నాశనం కావడంతో రోజుకో చోట రైతులు పంటను దహనం చేస్తున్నారు. చేతికొచ్చిన వరి పంటకు దోమపోటు సోకడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పండిన పంట నెలకొరగడంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదని దిగాలు పడిన రైతులు పంటకు నిప్పు పెడుతున్నారు. రాజంపేట్ మండలం.. ఎల్లారెడ్డి పల్లి తండా కు చెందిన రైతులు బాబూలాల్, శ్రీనివాస్ లు చెరి రెండు ఎకరాల సన్నరకం వరి సాగు చేశారు. అయితే దోమపోటుతో గింజ కూడా రాకపోవడంతో వరి పంటకు నిప్పంటించారు. దీంతో వేల రూపాయల నష్టం వాటిల్లిందని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మరో పక్క లింగంపేట్ మండలంలో సన్నరకం వరి 6000 ఎకరాలలో సాగు చేయగా దాదాపు 2000 ఎకరాలకు పైగా దోమపోటు, అగ్గి తెగులు సోకాయి. ఒకపక్క మార్కెట్ లో సన్నరకం వరికి మద్దతు ధర లేకపోగా.. మరోపక్క దోమపోటు, తెగుళ్లు సోకడంతో కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండలం చామన్ పల్లికి చెందిన రైతు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో తన రెండెకరాల పొలంలో దొడ్డు రకం వరి సాగు చేయగా లాభలు వచ్చాయని.. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో ఈ సారి సన్న రకం వరి సాగు చేయగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటపొలంలో వర్షం నీరు నిలిచింది. దీంతో వరిపంట దోమపోటుకు గురై ఎండిపోయింది. దీంతో తీవ్రంగా నష్ట వస్తుందని భావించిన రైతు తీవ్ర మనస్థాపానికి గురై.. ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టాడు. ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా.. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా.. రైతన్నల బతుకులు మాత్రం మారడం లేదు. వర్షాలు లేక కొన్ని సార్లు, వర్షాలు ఎక్కువై కొన్ని సార్లు పంట చేతికి రాక పెట్టుబడులు కూడా పోగొట్టుకుంటున్నారు. తాను పండించే పంటను పసిపాపలా భావించి.. కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాత ఆ పంటకు తానే నిప్పు పెట్టడం అత్యంత విషాదకరం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-in-telangana-burning-crop-25-105756.html
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.