Publish Date:Aug 11, 2022
ఓ పిల్లవాడు చక్రాన్ని కర్రతో నెమ్మదిగా కొడుతూ అలా బండాట ఆడుతూంటాడు. ఇది మనలో చాలా మంది బాల్యంలో ఆడటాన్ని గుర్తుచేస్తుంది. అలా వెళుతూన్నవాడికి పూర్వం అయితే పది పైసలు బిళ్ల కనపడగానే అమాంతం ఆగి దాన్ని తీసి చొక్కోకో, నిక్కరుకో తుడిచి జేబులో పడేసుకుంటాడు. ఇక వాడికి లోకంలో మరేమీ అక్కర్లేనంత ఆనందం. అమాంతం ఇంటికి వెళ్లి తల్లికి చూపిస్తాడు. ఆమె ఏమన్నదో విన కుండా గల్లీ చివర్లో దుకాణానికి వెళ్లి తోచినది కొని తింటాడు. పది పైసల ఆనందమే అంతుంటే ఏకంగా వజ్రమే దొరికితే! తప్పకుండా ఊళ్లో భూస్వామి నా ముందు బలాదూర్ అనే అను కుంటాడు.
ఇటీవల కర్నూలు జిల్లా జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు పొలాని వెళ్లాడు. రోజూ వెళ్లినట్టే అదే దారంటా వెళ్లాడు. ఈ ఏడు వర్షాల భీభత్సంతో పంటలు సరిగా పండుతాయా, తన పిల్లల చదువు, ఇతర ఖర్చుల సంగతేమిటీ.. ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి. అలానే కర్రపోటు వేసుకుంటూ ముం దుకు వెళ్లా డు. అంతలో రెండడుగుల దూరంలో ఏదో మెరిసినట్టయింది. మెల్లగా వెళ్లి పట్టి పైకి తీసాడు. అరచేతిలో పెట్టి పరిశీలనగా చూశాడు. అది మామూలు రాయి కాదు ఏకంగా వజ్రమే.. పది క్యారెట్లది.
ఈ సంగతి తెలుసుకున్న పెరవలి, జొన్నగిరి ప్రాంతాలకు చెందిన కొందరు వ్యాపారులు దాన్ని ఎంతైనా డబ్బు పెట్టి కొనేయడానికి సిద్ధమయ్యారు. సదరు రైతు ఇంటి ముందు ఊరు ప్రజలు, కాస్తంత ధనికు లూ క్యూకట్టారు. ఇవేమీ తెలియని పక్క పొలంవాడు.. బావా!.. ఏంజెసినా..ఇంతమంది పడ్డారు? అని అడిగాడే గాని తన స్నేహితుడి జాతకం మారిందని తెలిసి ఎంతో సంతోషించాడు.
చిత్రమేమంటే, ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు. అది సాదాసీదా రైతుకి చిక్కిం ది గనుక రూ.50 లక్షలకు అమ్ముడు పోయింది. ఎప్పడూ ఇంత సొమ్ము చూడని ఆ రైతు దేవుడు ఉన్నాడని అనుకున్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmer-found-diamond-39-141736.html
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.