Publish Date:Jul 14, 2022
రైతే రాజు.. ఒకప్పటి మాట. ఈరోజుల్లో రైతు కష్టాలు ఎవరికీ వద్దురా బాబూ అనిపిస్తుంది. ఊహించని కష్టాలు అనుభవించిన మహారాష్ట్ర రైతు ఒకతను మన ఊహకి అందని చిత్రమైన ఆలోచన చేశాడు. ఎవరైనా పిల్లల చదవుకో, ఇల్లు కట్టుకోవడానికో, వ్యవసాయ పనులకో బ్యాంక్ రుణాలు తీసుకుంటారు. కానీ మహారాష్ట్ర హింగోలీ కి చెందిన కైలాష్ పతంగే మాత్రం ఏకంగా హెలికాప్టర్ కొనడానికి రుణం కావాలని బ్యాంక్ వారిని సంప్రదించాడు. 6.6 కోట్ల రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ అధికారులు, ఈ సంగతి విన్నవారూ కొంతసేపు ఆశ్చర్యం నుంచీ బయటపడలేదు. ఒక్కరిద్దరైతే గట్టిగా నవ్వారు, ఇంకొందరు వీడికేమైనా పిచ్చిగాని పట్టిందేమో.. అనీ అనుకున్నారు. పిచ్చి ఆ రైతుకి పట్టలేదు. ఆ తెలివైన ఆలోచన చదువుకున్నవారికి రాలేదు.
గింజలు, ఎరువుల నాణ్యత లోటు, తగినంత విద్యుత్ సౌకర్యం లేకపోవడం, గిట్టుబాటు ధరకోసం అందరితో గొడవలు, అవమానాలు, వీటికీ తోడు అకాల వర్షాలూ రైతు జీవితాన్ని కుంగదీస్తున్నాయి. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ రైతుల వ్యధ ఇలానే వుంది. పంటమార్పిడి, ఆధునిక సేద్యా విధానాలు అనుసరించడంలో మధ్యవర్తులు, దళారీల మోసాలు ఒక్కటేమిటి అంతా సమస్యల వలయమే. మధ్యలో బిక్కు బిక్కుమంటూ రైతు. ఇలాంటి బాధలు అనుభవించే ఒక రైతు ఎవ్వరూ ఊహించని ఆలోచన చేశాడు.
తన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయడం ఇక తనవల్ల కావడం లేదని తేల్చుకున్నాడు గోరెగోవ్ జిల్లా తక్తోడా గ్రామానికి చెందిన పతంగే. రెండేళ్లుగా సోయాబీన్స్ పంట వేస్తున్నాడు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పైగా అకాల వర్షాలు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టాయిట. ఒక రోజంతా ఆలోచించి అతను బ్యాంక్కి వెళ్లి రుణం అడిగేడు. హెలికాప్టర్ కొనడానికి అని బ్యాంక్ వారి ప్రశ్నలకు ఒకే సమాధానం ఇచ్చాడు. హెలికాప్టర్ ఏం చేస్తావన్నారు. అతగాడు తడుముకోకుండా దాన్ని అద్దెకి తిప్పుతానన్నాడు. బ్యాంక్ మేనేజర్, ఉద్యోగులు నోరెళ్లబెట్టారు.. ఆహా ఏమి ఆలోచన చేశావయ్యా.. అన్నారంతా. ఆనక నవ్వు కున్నారంతా. కానీ పతంగెకి కోపం రాలేదు. చాలా ప్రశాంతంగా.. అయ్యా, మీరు నవ్వుతున్నారుగానీ, మాబోటి వారికి పెద్ద పెద్ద కలలు కనే అర్హత లేదా? ధనికులేనా పెద్ద కలలు కనేది? అని వాళ్ల నోళ్లు మూయించాడు. పైగా వేరే ఏదన్నా వ్యాపారం చేసు కుందామంటే పెద్ద పోటీనే ఎదుర్కోవాలి గనుక దీన్ని ఎంచుకున్నానన్నాడు. రైతు తెలివి ముందు ఆఫీసర్లు డంగ్ అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmer-applied-for-loan-to-buy-helicopter-25-139754.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.