Publish Date:Jul 14, 2022
రైతే రాజు.. ఒకప్పటి మాట. ఈరోజుల్లో రైతు కష్టాలు ఎవరికీ వద్దురా బాబూ అనిపిస్తుంది. ఊహించని కష్టాలు అనుభవించిన మహారాష్ట్ర రైతు ఒకతను మన ఊహకి అందని చిత్రమైన ఆలోచన చేశాడు. ఎవరైనా పిల్లల చదవుకో, ఇల్లు కట్టుకోవడానికో, వ్యవసాయ పనులకో బ్యాంక్ రుణాలు తీసుకుంటారు. కానీ మహారాష్ట్ర హింగోలీ కి చెందిన కైలాష్ పతంగే మాత్రం ఏకంగా హెలికాప్టర్ కొనడానికి రుణం కావాలని బ్యాంక్ వారిని సంప్రదించాడు. 6.6 కోట్ల రుణం కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. బ్యాంక్ అధికారులు, ఈ సంగతి విన్నవారూ కొంతసేపు ఆశ్చర్యం నుంచీ బయటపడలేదు. ఒక్కరిద్దరైతే గట్టిగా నవ్వారు, ఇంకొందరు వీడికేమైనా పిచ్చిగాని పట్టిందేమో.. అనీ అనుకున్నారు. పిచ్చి ఆ రైతుకి పట్టలేదు. ఆ తెలివైన ఆలోచన చదువుకున్నవారికి రాలేదు.
గింజలు, ఎరువుల నాణ్యత లోటు, తగినంత విద్యుత్ సౌకర్యం లేకపోవడం, గిట్టుబాటు ధరకోసం అందరితో గొడవలు, అవమానాలు, వీటికీ తోడు అకాల వర్షాలూ రైతు జీవితాన్ని కుంగదీస్తున్నాయి. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ రైతుల వ్యధ ఇలానే వుంది. పంటమార్పిడి, ఆధునిక సేద్యా విధానాలు అనుసరించడంలో మధ్యవర్తులు, దళారీల మోసాలు ఒక్కటేమిటి అంతా సమస్యల వలయమే. మధ్యలో బిక్కు బిక్కుమంటూ రైతు. ఇలాంటి బాధలు అనుభవించే ఒక రైతు ఎవ్వరూ ఊహించని ఆలోచన చేశాడు.
తన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేయడం ఇక తనవల్ల కావడం లేదని తేల్చుకున్నాడు గోరెగోవ్ జిల్లా తక్తోడా గ్రామానికి చెందిన పతంగే. రెండేళ్లుగా సోయాబీన్స్ పంట వేస్తున్నాడు. కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పైగా అకాల వర్షాలు పెద్ద సమస్యనే తెచ్చిపెట్టాయిట. ఒక రోజంతా ఆలోచించి అతను బ్యాంక్కి వెళ్లి రుణం అడిగేడు. హెలికాప్టర్ కొనడానికి అని బ్యాంక్ వారి ప్రశ్నలకు ఒకే సమాధానం ఇచ్చాడు. హెలికాప్టర్ ఏం చేస్తావన్నారు. అతగాడు తడుముకోకుండా దాన్ని అద్దెకి తిప్పుతానన్నాడు. బ్యాంక్ మేనేజర్, ఉద్యోగులు నోరెళ్లబెట్టారు.. ఆహా ఏమి ఆలోచన చేశావయ్యా.. అన్నారంతా. ఆనక నవ్వు కున్నారంతా. కానీ పతంగెకి కోపం రాలేదు. చాలా ప్రశాంతంగా.. అయ్యా, మీరు నవ్వుతున్నారుగానీ, మాబోటి వారికి పెద్ద పెద్ద కలలు కనే అర్హత లేదా? ధనికులేనా పెద్ద కలలు కనేది? అని వాళ్ల నోళ్లు మూయించాడు. పైగా వేరే ఏదన్నా వ్యాపారం చేసు కుందామంటే పెద్ద పోటీనే ఎదుర్కోవాలి గనుక దీన్ని ఎంచుకున్నానన్నాడు. రైతు తెలివి ముందు ఆఫీసర్లు డంగ్ అయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmer-applied-for-loan-to-buy-helicopter-25-139754.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.