సన్‌రైజర్స్...ఆర్సీబీ మ్యాచ్ టికెట్ల రేట్లపై ఫ్యాన్స్ ఆగ్రహం

Publish Date:May 15, 2026

Advertisement

 

ఐపీఎల్‌లో అత్యంత క్రేజ్ ఉన్న మ్యాచ్‌లలో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మే 22న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెరగడం ఫ్యాన్స్‌లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్ బుకింగ్ ప్రారంభం కావడంతో వేలాదిమంది అభిమానులు ఒకేసారి లాగిన్ అయ్యారు. యాప్‌లో దాదాపు 2.6 లక్షల మంది క్యూ‌లో ఉన్నట్లు కనిపించడంతో టికెట్ దక్కడం కష్టమైందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టికెట్లు కొద్ది నిమిషాల్లోనే “సోల్డ్ అవుట్”గా చూపించి, తర్వాత వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక ధరలతో పోలిస్తే బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు.

పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:

₹950 టికెట్ → ₹2000
₹1500 టికెట్ → ₹3000
₹1910 టికెట్ → ₹3500
₹2500 టికెట్ → ₹4500
₹4500 టికెట్ → ₹6000
₹7000 టికెట్ → ₹10,000
₹23,000 బాక్స్ టికెట్ → ₹30,000
₹30,000 కార్పొరేట్ బాక్స్ → ₹45,000

లక్షల సంఖ్యలో అభిమానులను క్యూ‌లో ఉంచి చివరకు “సోల్డ్ అవుట్” అని చూపించడం పారదర్శకత కాదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ డిమాండ్‌ను అవకాశంగా మార్చుకుని టికెట్ ధరలను పెంచుతున్నారని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
ఈ నెల 20వ తేదీన దేశంలోని అన్ని మెడికల్ షాపులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది.
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది.
బండి సంజయ్‌ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.