ఫ్యాన్ స్పీడ్ త‌గ్గింది.. వైసీపీ నేత‌ల్లో భ‌యం పెరిగింది

Publish Date:Apr 26, 2022

Advertisement

వైసీపీ దూకుడు మాయం అయిపోయింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఈ మౌనం ఆ పార్టీ ఉనికినే నామమాత్రంగా మార్చేసింది. ఏ మంటే ఏమౌతుందోన్న భయం కొత్త మంత్రుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడూ ఎదురుదాడితో ప్రత్యర్థుల మీద విమర్శలతో విరుచుకుపడే వైసీపీలో ఇప్పుడెందుకీ మౌనం. 
పార్టీలో లొసుగులు, ప్రభుత్వంలో అవకతవకలు ఒక్కసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలలో బట్టబయలైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం కారణంగా అన్ని వర్గాలూ జగన్ పాలనపై అసంతృప్తితో ఉన్నాయని మంత్రి పదవులు కోల్పొయిన మాజీ సచివులు బహిరంగంగానే వెళ్లగక్కేసారు.
అదే సమయంలో తెలుగదేశం కూడా స్పీడ్ పెంచింది. మాట తిప్పని, మడమ తిప్పని వైసీపీ నేత అసలు రీతిని ఎండగడుతూ విమర్శల దూకుడు పెంచింది. మామూలు పరిస్థితుల్లో అయితే వైసీపీ శ్రేణులు, ట్రేడ్ మార్క్ నేతలు తెలుగదేశంపై దూషణలతో విరుచుకుపడేవారు. ఇప్పుడా పని చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ముందుకు రావడం లేదు అనే కంటే సాహసించడం లేదని చెప్పడం సబబుగా ఉంటుంది. వైకాపా మౌనం వ్యూహాత్మకమేమీ కాదనీ, సొంత పార్టీలోనే అసమ్మతి బుసలు కొడుతుంటే...ఏం మాట్లాడితే ఏమౌతుందోనన్న భయమే వారిని మౌనాన్నిఆశ్రయించేలా చేస్తున్నదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సాధారణంగా విపక్షం విమర్శలను తిప్పి కొట్టే బాధ్యత మంత్రలు తీసుకుంటారు. జగన్ గత మంత్రివర్గం అంతా తమ శాఖకు సంబంధిచిన విషయాలపై కంటే ప్రత్యర్థి పార్టీని దనుమాడటంపైనే దృష్టి సారించారు. విమర్శలలో హద్దులను కూడా పాటించని సందర్భాలెన్నో ఉన్నాయి. విపక్ష నేతనూ, నేత కుటుంబీకుల్నీ కూడా వ్యక్తిత్వ హననం చేయడమే లక్ష్యంగా విమర్శలు చేశారు.
అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పరిధి దాటి విమర్శిస్తే ప్రజాక్షేత్రంలో పలుచన అవుతామన్న విషయం వారికి స్పష్టంగా అర్ధమైంది. ఇక తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శించాలంటే ఆ ప్రభుత్వ పాలనలో కంటే వైసీపీ పాలనలో అభివృద్ధి మెండుగా జరిగిందని చెప్పుకోగలగాలి. మూడేళ్ల పాలన అనంతరం అభివృద్ధి గురించి మాట్లాడేందుకు వైసీపీకి ఒక్క అంశం కూడా కనిపించని పరిస్థితి ఉంది.  సంక్షేమ పథకాల గురించి చెప్పుకుందామా అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులెవరూ తాము సంతోషంగా ఉన్నామని చెప్పడానికి ముందుకు రావడం లేదు. పైపైచ్చు ఏ వర్గాలకైతే తాము సంక్షేమ పథకాలు అందించామని వైసీసీ చెప్పుకుంటోందో...  ఆవర్గాల నుంచే ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 
ఈ పరిస్థితుల్లోనే కొత్త మంత్రులకు తమ ప్రభుత్వం ఘనత ఇదీ అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. కొత్త టీమ్ లో వాగ్ధాటి ఉన్న నేతలుగా గుర్తింపు పొందిన అంబటి రాంబాబు, రోజా కూడా మునుపటి విమర్శల దాడిని కొనసాగించేందుకు జంకుతున్నట్లుగా కనిపిస్తున్నది.
అంబటి రాంబాబు అయితే మంత్రిగా తొలి విలేకరుల సమావేశంలోనే మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను... నేను చెప్పింది రాసుకోండి చాలు అంటూ చేతులెత్తేశారు. ఇక రోజా సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతిని ఎదుర్కొంటూ...మౌనమే మేలు అన్నట్లుగా ఉన్నారు. మహిళా హోంమంత్రి తొలి మీడియా మీట్ లోనే తాను డమ్మీనని చెప్పకనే చెప్పేశారు.  ఇక మంత్రులకు బదులుగా మీడియా ముందుకు వచ్చి సర్కాస్టిక్ గా విపక్షంపై విమర్శలు గుప్పించే సజ్జల... కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరువాత తొలి సారిగా తమ ప్రభుత్వ అజెండా ఏమిటన్నది బయటపెట్టేశారు. చంద్రబాబును మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని కుండ బద్దలు కొట్టేశారు. ఆ సింగిల్ పాయింట్ అజెండా తప్ప తమ ప్రభుత్వానికి మరేదీ ముఖ్యం కాదనేశారు.  దీంతో వైసీపీకి చెప్పుకోవడానికి ఇంకేం మిగలలేదు. అందుకే ఏం లేనప్పుడు మాట్లడడమెందుకని వైకాపా నేతలు మౌనాన్నే ఆశ్రయించారు. 
తన పలుకుబడి పలుచన అయ్యిందన్న గ్రహింపునకు  వచ్చిన జగన్ ఇక పాలన సంగతి తరువాత చూసుకుందాం...ముందు తనకు అచ్చొచ్చిన ఫార్ములా జనం సమస్యలు తెలుసుకునే పేరుతో ప్రజలలోకి వెళదాం అన్న నిర్ణయానికి వచ్చేశారు. అయితే  రాజకీయ పండితులు మాత్రం విపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి వెడితే సమస్యలు తెలుస్తాయి కానీ, అధికారంలో ఉండి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రజలలోకి వెళ్లడం వల్ల ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనడం వినా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.