Publish Date:May 10, 2024
వైసీపీ ప్రభుత్వంలో అడ్డూ, అదుపు లేకుండా వ్యవహరిస్తున్న భజనపరులకు ఎన్నికల కమిషన్ కట్టడి చేసింది . నా కెవ్వరూ అడ్డూ లేరు అనుకున్నవారిపై కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం మారితే ప్రత్యర్థులపై కేసులు నమోదవుతాయి. కానీ వైసీపీ ప్రభుత్వ హాయంలోనే కేసులు నమోదు కావడం గమనార్హం. కర్మ సిద్దాంతం ప్రకారం నువ్వు ఏమిస్తావో తిరిగి నువ్వు అందే పొందుతావు. ఇన్నాళ్లు ప్రత్యర్థుల మీద అక్రమ కేసులు బనాయించిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు తలొగ్గాల్సి వచ్చింది.స్వంత పార్టీ నేతలపై కేసులు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఇంఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. భార్గవ్ పై 171f, 171g, 505(2), రెడ్ విత్120బి ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయ్యింది. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ.. ఆ పార్టీ సీనియర్ నేత వర్లరామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఈసీ కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించగా.. సీఐడీ కేసు నమోదు చేసింది.సజ్జల భార్గవ్ ఆధ్వర్యంలో ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పింఛన్ల ఇంటికి ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేశారని టీడీపీ చెబుతోంది. రాష్ట్రంలో వృద్ధులకు ఏప్రిల్ 1న పింఛన్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని.. రాష్ట్ర వ్యాప్తంగా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రచారం చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయగా.. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు సీఐడీ నుంచి నివేదిక వెళ్లాల్సి ఉంది. అనంతరం ఎలాంటి చర్యలు ఉంటాయన్నది చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/false-propaganda-against-chandrababu-case-registered-against-sajjala-bhargav-as-per-the-order-of-ec-25-175534.html
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.