ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది ఉండవల్లీ!

Publish Date:Feb 19, 2025

Advertisement

రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మరపిస్తారు. వైఎస్ కు నమ్మిన బంటుగా ఉండవల్లి రాజకీయాలలో గుర్తింపు పొందారు. ఆయన ఆశీస్సులతో రాజమహేంద్రవరం నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. లోక్ సభ సభ్యుడిగా  ఆయన రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏం చేశారో తెలియదు కానీ, రాష్ట్ర విభజన తరువాత రాజకీయ సన్యాసం ప్రకటించి.. తన గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహనరెడ్డి శ్రేయోభిలాషిగా మిగిలిపోయారు.

ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయినా, అవినీతి, అరాచకత్వం రాజ్యమేలినా.. ఉండవల్లికి చీమకూడా కుట్టలేదు. కానీ జగన్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ.. ఆయనకు మద్దతుగా మీడియా ముందుకు వచ్చి తనకు మాత్రమే సాధ్యమైన హేతురహిత వ్యాఖ్యానాలతో జగన్ తరఫున మాట్లాడే వారు. సీనియర్ రాజకీయ నాయకుడు అయి ఉండీ వాస్తవాలను గుర్తించకుండా జగన్కు అనుకూలంగా ఆయన చేసిన విశ్లేషణలూ, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ నవ్వుల పాలైన సందర్భా లెన్నో ఉన్నాయి. ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారి జనంలో క్రెడిబులిటీ కోల్పోయారు.   తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ కు మద్దతుగా నిలవడం కోసం వాస్తవాలను  ఆయన వక్రీకరించిన విధానంపై వైసీపీయులు కూడా ఒకింత అసహనానికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి. 

రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయ సన్యాసం పుచ్చుకున్న ఆయన బుద్ధిగా రాజకీయాలు మాట్లాడకుండా తన పని తాను చూసుకోకుండా తగుదునమ్మా అంటూ జగన్ కోసం వాస్తవాలను వక్రీకరించిన వైనంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనతో పాటే రాష్ట్ర విభజనను వ్యతిరేకించి రాజకీయాలకు దూరమైన లగడపాటి.. ఆ తరువాత ఎన్నడూ రాజకీయాలపై మాట్లాడలేదు. విశ్లేషణలు చేయలేదు. కానీ ఉండవల్లి మాత్రం అందుకు భిన్నంగా జగన్ కోసం వంకర రాజకీయాలు చేస్తూనే వస్తు న్నారు. గత ఏడాది ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని, జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన తరువాత   ఉండవల్లి మరింత చురుకుగా జగన్ కు మద్దతుగా మాట్లాడటం మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో ఆయన రాజకీయ సన్యాసానికి గుడ్ బై చెప్పి జగన్ కోసం వైసీపీ తీర్థం పుచ్చుకుని పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వచ్చాయి. అయితే  నేరుగా జగన్ పార్టీలో చేరి తాను చేసేదేం లేదని గ్రహించిన ఉండవల్లి రాజకీయ సన్యాసాన్ని కంటిన్యూ చేస్తానంటూ బహిరంగ ప్రకటన ఇచ్చి జగన్ కు తన పరోక్ష మద్దతు కొనసాగుతుందన్న సంకేతాలిచ్చారు. అదే సమయంలో జగన్ కు ప్రయోజనం చేకూర్చడం కోసం ఇతర పార్టీల మధ్య సఖ్యతకు బీటలు వారే వ్యాఖ్యలకు తెరలేపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఉండవల్లి కూటమి పార్టీల్లో విభేదాలున్నాయన్న అనుమానాలు జనబాహుల్యంలో కలిగించేలా వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలతో తన వంతు ప్రయత్నం చేశారు.

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆంధ్ర ప్రదేశ్ కు ఆశాజ్యోతిగా పవన్ కల్యాణ్ను అభివర్ణిస్తూ మునగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందర్నీ మెప్పిస్తున్న పవన్ కల్యాణ్ ను ఒక డిఫరెంట్ పొలిటీషియన్ గా పేర్కొంటూ ఉండవల్లి తనకు మాత్రమే సాధ్యమైన లౌక్యాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు కంటే పవన్ కల్యాణే మంచి నాయకుడని   చెప్పడం ద్వారా తెలుగుదేశం, జనసేనల మధ్య గ్యాప్ సృష్టించి తద్వారా జగన్ కు ఏదో మేరకు రాజకీయ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారు.

 పవన్ కల్యాణ్ వల్ల మాత్రమే రాష్ట్ర‌ విభజన సమస్యలు పరిష్కారం అవుతాయ‌ని ప్రజలు నమ్ముతున్నారనీ , విభ‌జ‌న హామీల సాధ‌న‌ కోసైం ఏం చేయాలో తాను పవన్ కు లేఖ రాశాననీ పేర్కొన్నారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆయన కొత్తగా మొదలు పెట్టిన పవన్ భజన వల్ల జగన్ కు ఇసుమంతైనా ప్రయోజనం చేకూరదని అంటున్నారు. జగన్, వైసీపీ పవన్ ను టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఉండవల్లి స్పందింలేదని గుర్తు చేస్తున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.