కేసీఆర్ కు ఇద్దరు మొనగాళ్ల దెబ్బ.. గులాబీ పార్టీకి ఇక గండాలేనా? 

Publish Date:Nov 3, 2021

Advertisement

ఉప ఎన్నికలు.. తెలంగాణ రాష్ట్ర సమితికి అచ్చొచ్చిన అంశం. ఉద్యమ సమయంలో పార్టీ బలోపేతానికి ఉపఎన్నికలనే అస్త్త్రాలుగా మార్చుకున్నారు కేసీఆర్. ఉప ఎన్నికల ద్వారానే కారు పార్టీ జనంలోకి చోచ్చుకుని వెళ్లగలిగింది. వైఎస్సార్  టైమ్ లో కొన్ని ఓడిపోయినా.. బైపోల్స్ మాత్రం టీఆర్ఎస్ కు బూస్ట్ ఇస్తూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర్రం వచ్చాక కూడా ఉప ఎన్నికల్లో సత్తా చాటింది గులాబీ పార్టీ. 2014 నుంచి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరగగా.. ఆరింటిలో టీఆర్‌ఎస్‌ పార్టీయే జయకేతనం ఎగురవేసింది. 

2014లో మెదక్ లోక్ సభ, 2015లో జరిగిన వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయం సాధించింది కారు పార్టీ. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో 2016లో పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. 2016లోనే నారాయణ్ ఖేడ్ కు జరిగిన ఉప ఎన్నికలోనూ కారు దూసుకుపోయింది. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతికి షాకిచ్చింది గులాబీ పార్టీ. నోముల నర్సింహయ్య మరణంతో 2021 లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం జానారెడ్డిని మట్టికరిపించి సత్తా చాటింది అధికార పార్టీ. 

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో సత్తా చాటిన టీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో మాత్రం ఓడిపోయింది. అవి దుబ్బాక, తాజాగా జరిగిన హుజురాబాద్. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు రఘునందన్ రావు. తాజాగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బంపర్ విక్టరీ కొట్టి కారుకు షాకిచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ ను ఎదురించి నిలిచిన ఇద్దరు మొనగాళ్లుగా రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నిలిచారు. కేసీఆర్ వ్యూహాలు, కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టడం వల్లే ఈ ఇద్దరు విజయం సాధించారని చెబుతున్నారు. 

రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైనది కేసీఆర్ ఎత్తుగడులను ఊహించి తిప్పికొట్టడమే. ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కాబట్టే అధికార పార్డీని ఓడించగలిగారు ఈ ఇద్దరు నేతలు. ఇందుకు వాళ్లు గతంలో కేసీఆర్ తో పనిచేసిన అనుభవమే సహకరించిందని అంటున్నారు. రఘునందన్ రావు, ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతల్లో రఘునందన్ ఒకరు. కేసీఆర్ కోటరిలో ముఖ్యుడిగా ఉన్నారు. 2001-13 మధ్య టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు రచించండంతో కేసీఆర్ కు రఘునందన్ రావు కీలకంగా ఉన్నారు. 2006, 2008, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ తో కలిసి రఘునందన్ రావు వ్యూహాలు రచించారు. 2013లో కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చారు. 2014లో బీజేపీలో చేరారు రఘునందన్ రావు.

ఇక ఈటల రాజేందర్ 2003 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కొద్ది కాలంలోనే ఆయన కేసీఆర్ కు దగ్గరయ్యారు. పార్టీలో టాప్ ఫైవ్ లీడర్లలో ఒకరిగా నిలిచారు. హుజురాబాద్ నుంచి వరుసగా ఆరు సార్లు విజయం సాధించారు ఈటల. 2009లో అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించారు. బీసీ లీడర్ గా ఎదిగిన రాజేందర్.. కేసీఆర్ కు కుడిభుజంగా నిలిచారని చెబుతున్నారు. రాజకీయ ఎత్తుగడలను ఈటల ద్వారానే కేసీఆర్ అమలు చేసే వారంటారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యమ సంఘాలు, కుల సంఘాలను చీల్చడంలోఈటలను కేసీఆర్ పావుగా వాడారని చెబుతారు. మందకృష్ణ, ఆర్ కృష్ణయ్యకు పోటీగా కొత్త సంఘాలు ఏర్పాటైంది అందులో భాగాంగానే. కేసీఆర్ ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయో అతి దగ్గరగా చూసిన వ్యక్తి ఈటల రాజేందర్. సిద్దిపేట నుంచి నాగార్జున సాగర్ వరకు.. అన్ని ఉప ఎన్నికల్లో కీలకంగానే వ్యవరించారు ఈటల రాజేందర్. 

కేసీఆర్ తో సన్నిహితంగా ఉండటం, ఆయన ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టే... దుబ్బాక, హుజురాబాద్ లో వాళ్లిద్దరు అధికార పార్టీని ఎదుర్కొని నిలిచారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా తమ ఎత్తుగడలు అమలు చేయడం, సైలెంటుగా పని కానియడం కలిసివచ్చిందనే చర్చ నడుస్తోంది. తాజా విజయంతో అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ఇకపై సభలో అధికార పార్టీకి చుక్కలు కనిపిస్తాయని, రాజా సింగ్, రఘునందన్ రావు, రాజేందర్ లు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఖాయమంటున్నారు. గతంలో ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం రాజేందర్ కు ఉంది. సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలను ఎదురించారు రాజేందర్. ఇకపై కేసీఆర్ ను చీల్చి చెండాడుతారని అంటున్నారు. ఇంతకాలం అసెంబ్లీ ఏకపక్షంగా సాగేదని, ఇకపై కేసీఆర్ కు సమస్యలు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. 

By
en-us Political News

  
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మే 18( శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, చట్టాలను ఉల్లంఘించి మరీ అమలు చేసిన విధానాలను విపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు పలు మార్లు ప్రశ్నించారు. నిలదీశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాపాలనను మంటగలిపేస్తున్నారంటూ హయ్యస్ట్ అథారిటీస్ కు లేఖలు కూడా రాశారు. గవర్నర్, రాష్ట్రపతి, సీఎస్.. ఇలా ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ విధానాలను అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. తట్టని తలుపు లేదు.
విషయాన్ని డైవర్ట్ చేసి తాము అనుకున్నది సైలెంట్ గా చేసుకుని పబ్బం గడిపేయడంలో వైసీపీ నేతలు డాక్టరేట్ సాధించారని చెప్పొచ్చు. ప్రతి విషయంలోనూ వారు ఒకటి చేయాలనుకుంటే.. అందుకు భిన్నంగా విపక్ష నేతలు, ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తీసుకువస్తారు. అదే సమయంలో తాము చక్కబెట్టదలచుకున్న కార్యాన్ని సెలెంట్ గా చక్కబెట్టేస్తారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-18
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.