కొండాతో ఈటల కొత్త పార్టీ? అంతా ఆయన డైరెక్షనేనా.. 

Publish Date:May 7, 2021

Advertisement

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. తనను అవమానకరంగా తొలగించారనే కసితో ఉన్న ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తారని, కొత్త పార్టీతో కేసీఆర్ ను ఎదుర్కొంటారనే టాక్ నడుస్తోంది. కొత్త పార్టీ కాకుండా ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా  ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మేడ్చల్‌లోని ఈటల నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వీళ్లిద్దరు కలిసి పార్టీ పెట్టనున్నారని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాత్రం ఈ భేటీకి రాజకీయపరమైన కారణాలేమీ లేవని తెలిపారు. ఈటల భార్య జమున తమకు బంధువని, కేవలం సానుభూతితో మాత్రమే ఆయనను కలవడానికి వచ్చానన్నారు. తాము చాలా కాలం నుంచి మిత్రులమని.. కొన్ని పాత విషయాలు గుర్తుచేసుకున్నామన్నారు.
ఈటల తప్పేమీ చేయలేదని, అవమానానికి గురికావాల్సిన అవసరం లేదని కొండా చెప్పారు. కేసీఆర్‌ ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. వాటిలో ఇదొకటని కొండా అభిప్రాయపడ్డారు. ఈటల ఏ నిర్ణయం తీసుకున్నా.. తెలంగాణ సమాజం ఆయన వెనుక ఉంటుందని విశ్వేశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఈటలతో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని కొండా చెబుతున్నా... కొత్త పార్టీ ఏర్పాటు గురించే చర్చ జరిగిందని తెలుస్తోంది. 

కేసీఆర్ సర్కార్ పై ఇప్పటికే పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. కొండా విశ్వేశర్ రెడ్డి కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కొంత కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఈటల రాజేందర్ మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో కేసీఆర్ ను గద్దే దించడమే లక్ష్యంగా వీళ్లు ముగ్గురు కలిసి కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్‌రెడ్డి.. ప్ర‌స్తుతం పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌. ఫుల్‌టైమ్ పీసీసీచీఫ్ చేయాల‌ని ఆయ‌న ఎప్ప‌టినుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే సీనియ‌ర్లు రేవంత్‌రెడ్డికి అడుగ‌డుగునా మోకాలు అడ్డుతున్నారు. పీసీసీ పీఠం రేవంత్‌కు ద‌క్క‌కుండా చేస్తున్నారు. దీంతో, కాంగ్రెస్ తీరుతో విసిగి వేసారి పోయిన రేవంత్‌.. సొంత పార్టీకి స‌న్నాహాలు చేస్తున్నార‌ని అంటున్నారు. అందులో భాగంగనే రేవంత్‌కు న‌మ్మ‌క‌మైన అనుచ‌రుడు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వచ్చారని అంటారు. అంతేకాదు అవ‌స‌ర‌మైతే కొత్త పార్టీ ఆలోచ‌న చేస్తానంటూ ప్ర‌క‌టించారు కొండా. 

తాజాగా జరుగుతున్న పరిణామాలతో రేవంత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డితో పాటు ఈట‌ల రాజేంద‌ర్ సైతం కేసీఆర్ వ్య‌తిరేక‌ రాజ‌కీయ శ‌క్తుల ఏకీక‌ర‌ణ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. తాను ఒక్క‌డిని ఒంట‌రిగా కేసీఆర్‌పై పోరాడే బ‌దులు.. రేవంత్‌రెడ్డి లాంటి బ‌ల‌మైన నాయ‌కుడితో క‌లిసి క‌ట్టుగా దండెత్తితే బెట‌ర్ అని ఈటల అనుకుంటున్నార‌ట‌. గ‌తంలోనే రేవంత్‌రెడ్డి, ఈట‌ల ప‌ర‌స్ప‌రం ట‌చ్‌లోకి వ‌చ్చార‌ని చెబుతున్నారు. ఇప్పుుడు కొండాతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై ఈటల చర్చిస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీళ్లద్దరి భేటీ రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఉద్యమ సంఘాలు, ఇతర పార్టీల్లో తనకు మద్దతుగా ఉంటారని భావిస్తున్న వాళ్లతోనే రాజేందర్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. 

కేసీఆర్ మామూలోడు కాదు. ఆర్థికంగా, రాజ‌కీయంగా, వ్యూహాల ప‌రంగా.. ఉద్దండుడు. అలాంటి కేసీఆర్‌ను  గ‌ద్దె దింపాలంటే.. పెద్ద ఎత్తున ఆర్థిక‌, రాజ‌కీయ‌ అండా, దండా అవ‌స‌రం. అందుకే రేవంత్‌రెడ్డి, ఈట‌ల రాజేంద‌ర్‌, కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి.. ఈ ముగ్గురు క‌లిసి కొత్త పార్టీతో కేసీఆర్‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్నారని అంటున్నారు ఈ ముగ్గురూ ఆర్థికంగా బాగా సంప‌న్నులే. డైన‌మిక్ లీడ‌ర్‌గా రేవంత్‌రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఊరూరా రేవంత‌న్న ఫ్యాన్స్ ఉన్నారు. కావ‌ల‌సినంత రాజ‌కీయ నేర్ప‌రిత‌నం, మాట‌కారి త‌నం రేవంత్ సొంతం. తెలంగాణ‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గ‌మైన రెడ్లంతా రేవంత్‌కు ఫుల్ స‌పోర్ట్‌గా ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ త‌క్కువేమీ కాదు. ఉద్య‌మ నాయ‌కుడిగా అన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌స్తుడు. సౌమ్యుడిగా మంచి పేరు. కేసీఆర్ చేతిలో అవ‌మానింప‌బ‌డ్డాడ‌నే సానుభూతి ఎలానూ ఉండ‌నే ఉంది. తెలంగాణ‌లో అధిక సంఖ్యాకులైన‌ బీసీ సామాజిక వ‌ర్గానికి ప్ర‌తినిధిగా ప్ర‌జ‌ల ముందుకు రాబోతున్నాడు. వీరికి తోడు ఆర్థికంగా సుసంప‌న్నుడు,  మాజీ ముఖ్య‌మంత్రి రంగారెడ్డి వార‌సుడైన కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డిలు క‌లిసి.. కొత్త పార్టీతో కేసీఆర్‌ను రాజ‌కీయంగా కుమ్మేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. 

రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కలసి ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీలోకి.. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున అసంతృప్త నేతలు వ‌ల‌స రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు సైతం ఈట‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని.. స‌రైన స‌మ‌యంలో వారంతా రాజేంద‌ర్ వెంట నిలుస్తార‌ని అంటున్నారు. ఏకంగా ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలే ఈట‌ల స‌పోర్ట‌ర్స్‌గా ఉన్నార‌ని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వారంతా ఈట‌ల నుంచి ఆర్థిక సాయం పొందిన వార‌ని.. వాళ్లంతా ఆ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది. 

By
en-us Political News

  
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.