హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. హుజురాబాద్ లో ఎన్ని కుట్రలు చేసినా తనను ఓడించలేకపోయారని చెప్పారు. ప్రజలంతా ఏకోన్ముఖంగా కేసీఆర్ చెంప చెల్లుమనిపించారన్నారు ఈటల. ప్రపంచ చరిత్రలో ఈ ఫలితం గొప్ప అధ్యాయమన్నారు. వందల కోట్ల రూపాయలు, మద్యం, పథకాలు పెట్టినా, ప్రతి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసినా ప్రజలు వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం బావుటాను ఎగురవేసి విధంగా ధర్మం వైపు.. హుజరాబాద్ ప్రజలు నిలబడ్డారన్నాపు ఈటల రాజేందర్. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా, కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నా.. వాళ్ల రుణం తీర్చుకోలేనేంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తనపై కుట్రలు చేసి కేసీఆర్ బయటికి పంపిస్తే బీజేపీ అక్కున చేర్చుకుందని చెప్పారు ఈటల రాజేందర్. తనకు అన్ని రకాలుగా అండగా ఉంటానని అమిత్ షా హామీ ఇచ్చారని తెలిపారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి తనకు బాసటగా నిలిచారని చెప్పారు. 2018లో తనకు లక్షల 4 వేల ఓట్లు వస్తే ఇప్పుడు లక్ష 7 వేల ఓట్లు వచ్చాయన్నారు. తన జెండాతో, తన బొమ్మతో నేను గెలిచానని అహంకారంగా మాట్లాడారో.. దానికి విరుద్ధంగా ప్రజలు పిలుపునిచ్చారని రాజేందర్ వెల్లడించారు. కేసీఆర్ అహంకారం మీద తెలంగాణ ప్రజలు సాధించిన విజయమన్నారు. 10 లక్షలు ఇచ్చినా అమ్ముడుపోబోమని దళిత బిడ్డలు ఎంతో గొప్పగా తనకు అండగా నిలిచి ఓట్లు వేశారని చెప్పారు.
స్మశాన వాటికలకు పిలిపించుకొని మరీ డబ్బులు పంచారని ఆరోపించారు ఈటల రాజేందర్. ముందుగా 6000, తర్వాత నాలుగు వేల చొప్పున పంచారన్నారు. పోలీసుల అండతో ఎస్కార్ట్ వాహనంలో డబ్బులు తెచ్చి పంచారని చెప్పారు.చివరికి తెల్లబట్టలో పసుపు బియ్యం పెట్టి దేవుడు ముందు ప్రమాణం చేయించుకున్నారని తెలిపారు. పెన్షన్ పోతుందని వృద్ధులను బెదిరించారని ఆరోపించారు. దళిత బంధు కూడా ఆపేస్తామని భయపెట్టారని తెలిపారు.
కుట్రదారులు ఎప్పుడు కుట్రలతోనే నాశనం అవుతారన్నారు ఈటల రాజేందర్. తనపై పోటీకి రావాలని కేసీఆర్, హరీష్ రావు కు సవాల్ చేస్తే.. రాకపోగా పొలగాన్ని నిలబెట్టారన్నారు. రెండు గుంటల వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా ఖర్చు చేశాడని ఈటల ప్రశ్నించారు. కుట్రలతో దొంగ ఉత్తరాలతో తనను ఓడించాలని చూస్తే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఎలా ఉంటుందో అలాగే జరిగిందన్నారు. హుజురాబాద్ వచ్చి కుట్రలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో పర్యటించి ఇక్కడ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా ఒత్తిడి తెస్తానని చెప్పారు ఈటల రాజేందర్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/etela-rajender-hot-comments-on-cm-kcr-huzurabad-by-poll-25-125754.html
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల అరెస్ట్ సంచలనమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు.
‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు