కేసీఆర్ చీటర్.. ఈటల ఫైర్

Publish Date:Oct 5, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ చీటర్ గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ కేసీఆర్ వెంట నడిచిన ఈటల తరువాత కేసీఆర్ తో విభేదించి..పార్టీ నుంచి బహిష్కృతుడైన సంగతి విదితమే. 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో కేసీఆర్ ఈటలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆర్థిక శాఖను కేటాయించారు. అయితే 2018లో విజయం సాధించి రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటలకు స్థానం కల్పించలేదు. అప్పటికే కేసీఆర్ విధానాలపై ఈటల తన అసంతృప్తి వ్యక్తం చేశారనీ, అందుకే దూరం పెట్టారనీ అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అనివార్యంగా మంత్రివర్గ విస్తరణలో ఈటలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేబినెట్ లోకి తీసుకున్నా.. ఆ తరువాత ఆరోపణల నెపంతో ఆయన మంత్రిపదవి నుంచీ, పార్టీ నుంచీ కూడా తొలగించారు. 
అనంతరం ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కమలం గూటికి చేరారు. తన రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి సత్తా చాటారు. అదే సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. బండి సంజయ్ తో విభేదాలు వచ్చినా, ఒక దశలో కమలం గూటిలో ఈటల ఉక్కపోతకు గురౌతున్నారు, ఆయన ఏ క్షణంలోనైనా బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తారన్న వార్తలు వచ్చినా పార్టీ హైకమాండ్ మాత్రం ఈటలకు మద్దతుగా నిలిచింది. చేరికల కమిటీని ఏర్పాటు చేసి మరీ ఈటలకు ఈ కమిటీ నేతృత్వ బాధ్యతలు అప్పగించింది. 
ఆ తరువాత పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ గా ఒక విధంగా చెప్పాలంటే అత్యంత కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈటల బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శల దాడిని తీవ్రం చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను, వాటిని విస్మరించిన తీరును గుర్తు చేస్తూ  విమర్శల దాడి ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ను దొంగ వాగ్దానాలతో జనాలను మోసం చేసిన ఛీటర్ గా అభివర్ణించారు. దళితుడిని సీఎం చేస్తానని చేసిన వాగ్దానం, దళిత బంధు కింద పది లక్షల రూపాయలు ఇస్తానంటే చేసిన వాగ్దానాలను కేసీఆర్ విస్మరించారనీ, అలాగే దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అంటూ వాగ్దానం చేసి ఆ తరువాత భూమి లేదంటూ దానినీ అటకెక్కించేశారనీ.. ఇలా పబ్బం గడుపుకోవడం కోసం వాగ్దానాలు చేయడం ఆ తరువాత వాటిని విస్మరించడం ద్వరా ప్రజలను మోసం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చీటర్ నంబర్ వన్ గా మారానని తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు. 

ప్రధాని మోడీపై ఇష్టారీతిన విమర్శలు గుప్పించి మర్యాద తెలియని నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్ బాటలోనే ఆయన కేబినెట్ మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని ఈటల అన్నారు. మాట ఇవ్వడం, తరువాత మరచిపోవడం రివాజుగా మార్చుకున్న కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి మారుపేరులా మారితే.. అన్నమాటకు కట్టుబడి విశ్వసనీయతకు మరోపేరుగా మోడీ నిలిచారన్నారు.

కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు తహతహలాడారన్న మోడీ మాటలను జనం విశ్వసిస్తున్నారనీ, తాను ఎన్డీయేలో చేరేందుకు సంసిద్ధుడైనందునే మోడీ చెప్పిన మాటను కేసీఆర్ ఇప్పటి వరకూ ఖండిం చలేదని ఈటల పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావం తరువాత కుటుంబ సమేతంగా అప్పటి కాంగ్రస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన కేసీఆర్ బీఆర్ఎస్( అప్పటికి టీఆర్ఎస్) ను కాంగ్రస్ లో విలీనం చేస్తానని మాట ఇచ్చి తప్పిన విషయం నిజం కాదా అని నిలదీశారు.   

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.