గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి. ప్రభుత్వం దళారీ వ్యవస్థ ను రూపుమాపలేకపోతోంది. దళారీల నుంచి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం మానేసి ఖజానా నింపుకోవడానికి జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేయలేక పోవడంతో సామాన్యుడిపై రోజు రోజుకూ ధరల భారం పెరుగుతోంది.
దాదాపు ఏడాది కాలంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ ప్రజల కొనుగొలుశక్తిని క్షీణింప చేసింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1శాతంగా ఉంది. నిత్యావసరాలపై జీఎస్టీ భారం పెరగడంతో మధ్యతరగతి, బడుగు జీవుల పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి మధ్యతరగతి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. కుటుంబరుణాలు జీడీపీలో 6.4 శాతానికి చేరాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారమే భారతీయ కుటుంబాల ఆదాయాలు తగ్గి,రుణాలు పెరుగుతున్నాయి. తాకట్టు రుణాలు 56 శాతం పెరిగాయి. వీటిలో 30శాతం డీఫాల్ట్ గా మారుతున్నాయి. రూపాయి మారకపు విలువ కనిష్ట స్థాయికి చేరడంతో విదేశీ ద్రవ్య నిల్వలు అడుగంటిపోతున్నాయి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పుకునే కేంద్రంలోని మోడీ సర్కార్.. ప్రజల ఆర్థిక పతనాన్ని పట్టించుకోవడం లేదు. షేర్లు, కార్పొరేట్లు అంటూ సంపన్న వర్గాల ప్రయోజనాలే పరమావధి అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యధికంగా జీఎస్టీ విధించే దేశంగా భారత్ అగ్రభాగంలో నిలబడింది.
ఒకేదేశం,ఒకే పన్ను అంటూ జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ ఈ విధానంలోని లోటుపాట్లను సరిదిద్దే విషయంలో మాత్రం ముందుకు రావడం లేదు. పెట్రోల్,డిజిల్ లను జీఎస్టీ పరిధిలో తీసుకురావాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను పెడచెవిన పెడుతోంది. సెస్సు,సుంకాలపేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా బాదేస్తూ ప్రజలపై మోయలేని భారం వేస్తున్నాయి. ఇక తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని సొంత భుజాలు చరిచేసుకుంటున్న కేంద్రంలోని మోడీ సర్కార్ ఎరువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు సరికదా డీఏపీ కి సబ్సిడీ ఎత్తివేసే ఆలోచన చేస్తున్నది. ఇక బియ్యం అయితే పండిచిన రైతుకూ, కొనుగోలు చేసే వినియోగదారులకూ కూడా చుక్కలు చూపిస్తోంది. పండించిన రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేసే వినియోగదారుడికి మాత్రం ధరా భారం నడ్డి విరిచేస్తున్నది. బ్రాండ్ల పేరుతో 25కేజీలు రూ.1600 పైగా అమ్ముతున్నారు. అలాగే పప్పుల ధరలు రైతులకు మేలు చేయలేకపోయినా వినియోగదారులకు మాత్రం చుక్కలు చూపుతున్నాయి. ఏ పప్పు అయినా కేజీ ధర 100 నుంచి 200వరకూ ఉన్నాయి. ఇక కూరగాయల విషయానికి వస్తే ఏ కూరగాయ కొనాలన్నా కిలో రూ.60నుంచి 100 వరకూ వెచ్చించాల్సిందే.
గత 8 నెలలలో నిత్యావసర సరుకుల ధరలు సగటున 50 శాతంపైగా పెరిగాయని ఒక అంచనా. ప్రభుత్వాలు ద్రవ్యోల్బణం తగ్గడానికి, నిత్యావసర ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్నది. జాతీయ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధి చేయక పోవడం వల్లనే దళారులు చెలరేగిపోతున్నారు. వినియోగదారుడికీ, రైతుకీ కూడా నష్టం కలగడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే కేంద్రం జీఎస్టీ బాదుడుపై కాకుండా జాతీయ మార్కెట్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ఒకే దేశం ఒకే పన్ను అని మాత్రమే కాకుండా ఒకే దేశం.. ఒకే ధర అన్న విధానాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/essential-commodities-prices-high-39-190848.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.