కేసీఆర్ రెచ్చగొట్టినందునే సభ జరుగుతోందా?

Publish Date:Sep 7, 2013

Advertisement

 

తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రాష్ట్ర విభజన చేస్తూ నిర్ణయం ప్రకటించిన తరువాత, హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా కేసీఆర్ మాట్లాడి, వారిలో లేని భయాందోళనలను కలిగించడం వలననే, నేడు ఏపీయన్జీవోలు హైదరాబాదులో సభ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

 

మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ అసలు కేసీఆర్ కి 2014ఎన్నికల వరకు తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేనందునే ఆవిధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి తెలంగాణా ప్రక్రియ జాప్యం జరిగేందుకు పరోక్షంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ డిల్లీలో కూర్చొని ఏమి చేస్తున్నాడని ఆయన ప్రశించారు. తెలంగాణా ఏర్పాటయితే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా విలీనం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నాడని ప్రశ్నించారు.

 

వారిరువురూ ఎపీయన్జీవోలను కూడా అంతే తీవ్రంగా విమర్శించారు. హైదరాబాదులో సభను నిర్వహిస్తూ వారు ఉద్దేశ్యపూర్వకంగా తెలంగాణా ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

 

తెదేపా నేతలిరువురు చెప్పిన మాటలలో వాస్తవం ఉంది. నిజానికి కేసీఆర్ “ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందే. వారికి వేరే ఆప్షన్ ఉండవు” అని చెప్పిన తరువాత నుండే వారిలో భయాందోళనలు మొదలయ్యాయి. నాటి నుండే ఆంధ్ర ఉద్యోగులు రాష్ట్ర విభాజను వ్యతిరేఖిస్తూ నిరసన దీక్షలు మొదలుపెట్టారు. అది తెలంగాణా ఉద్యోగులకు కోపం కలిగించడం సహజమే గనుక వారు కూడా ఆంధ్ర ఉద్యోగులతో పోటాపోటీగా దీక్షలు మొదలుపెట్టారు. తత్ఫలితంగా నేడు రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య ఘర్షణలు నిత్యకృత్యం అయిపోయాయి. నిన్న హైకోర్టులో న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణలు వాటికి పరాకాష్టగా నిలిచాయి. ఈ భయాందోళనలే నేడు వారిచే సభ నిర్వహింపజేస్తున్నాయి. తెదేపా నేతలు అదే మాట చెప్పారిప్పుడు.

 

నిజానికి కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా, రాష్ట్ర విభజన తరువాత చట్ట ప్రకారం జరుగవలసిన తంతు అంతా జరిగినప్పుడు, ఉద్యోగులలో బదిలీల మీద ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళిపోవలసి వస్తే వెళ్ళిపోయి ఉండేవారు. ప్రభుత్వోద్యోగాలు చేస్తున్నవారికి బదిలీలపై ఊర్లు మారడం తప్పదని వారికి తెలియకపోదు. కానీ కేసీఆర్ అన్నమాటలతో వారి భవిష్యత్ పట్ల అకస్మాత్తుగా అంతవరకు లేని భయాందోళనలు మొదలయ్యాయి. దానికి తోడూ తెరాసలో అతని కుటుంబ సభ్యులు కూడా వారిలో ఆ భయాందోళనలు మరింత పెరిగే విధంగా మాట్లాడేరు.

 

తెరాస నేతలు ఆంద్ర-తెలంగాణా ఉద్యోగుల మద్య జరుగుతున్న గొడవలలో తలదూర్చుతూ వారి మధ్య విద్వేషాలకు మరింత ఆజ్యం పోస్తున్నారు. సీమంధ్ర నేతలు కూడా అదేపని చేస్తున్నారంటే వారు తెలంగాణాను వ్యతిరేఖిస్తునందునే ఆపని చేస్తున్నట్లు అర్ధంఅవుతుంది. కానీ తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడుతున్న తెరాస కూడా అదే పనిచేయడం చూస్తే నిజంగానే వారికి తెలంగాణా ఏర్పాటు ఇష్టం లేదని భావించాలేమో! దీనిని బట్టి తెరాస నేతలెవరికీ కూడా ఎన్నికల వరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పడటం ఇష్టం లేదని తెదేపా నేతలు చేస్తున్నఆరోపణలు నిజమేననిపిస్తోంది.

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.