Publish Date:Oct 27, 2022
క్రికెట్ అనగానే పురుషుల క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. టెండూల్కర్, ధోనీ, కింగ్ కోహ్లీల గురించే చర్చోప చర్చలు. కానీ మరో వంక మహిళల క్రికెట్ దేశంలో ఎంతో ముందడుగువేస్తోంది. అంతర్జాతీయ టోర్నీల్లో గొప్పగా రాణిస్తోంది. కానీ పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టును గౌరవించడం చాలా తక్కువే. కారణాలు అనేక చెబుతారు కానీ ఇటీవలి కాలంలో మహిళలూ అద్భుతంగా రాణిస్తున్నారు. 2017లో టీ20 ప్రపంచకప్ రన్నర్ అప్ నిలిచిన భారత్ అమ్మాయిలు 2020 లో ఫైనల్ చేరుకున్నారు. అలాగే ఈ ఏడాది కామన్ వెల్గ్ గేమ్స లో రజత పతకం అందుకున్నారు. అన్ని విధాలా వారికి ఆర్ధిక పరంగా ఎంతో మద్దతు నియ్యాలనే విషయమై ఎంతో కాలం నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఈ అంశంలో మాజీలు కూడా బీసీసీఐ స్పందించాలనే సూచనలు చేశారు. మొత్తానికి ఇప్పటికి మహిళ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు పెంచుతూ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి నుంచి మహిళా క్రికెటర్లకు కూడా పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజు అందుకుంటారు.
క్రికెటర్ల మధ్య ఫీజుకు సంబంధించి చాలా కాలం నుంచి ఉన్న వ్యత్యాసాలను తొలగించాలనే నిర్ణయిం చుకున్నామని, బీసీసీ ఐతో కాంట్రాక్టులో ఉన్నవారికి ఈ లబ్ధి పొందే అవకాశం ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు.
బీసీసీఐ నిర్ణయం ప్రకారం మహిళా క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డేకి 6 లక్షలు, టీ20 మ్యాచ్ కి 3 లక్షలూ మ్యాచ్ ఫీజు రూపంలో అందుకుంటారు. 2023 లో మహిళల ఐపి ఎల్ ఆరంభానికి ముందే బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం దేశంలో మహిళా క్రికెటర్లను ఎంతో ఉత్సాహపరుస్తుంది. 2017 మహిళల ప్రపంచకప్ లో భారత్ రన్నరప్ గా నిలిచినప్పటి నుంచీ దేశంలో మహిళా క్రికెట్ పట్ల అభిమానం, ఆసక్తి రెండింతలయింది. అన్ని నగరాల్లో, పట్టణాల్లో ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్ పట్ల మొగ్గు చూపుతు న్నారు.
ఈ ఏడాదిలోనే న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని న్యూజిలాండ్ లో మహిళా క్రికెటర్లను ఎంతో ప్రోత్సహించింది. అక్కడ కూడా పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు లభిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/equal-match-fee-for-men-39-146122.html
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.