మహా సంక్షోభానికి ముగింపు?.. అసెంబ్లీలో బల నిరూపణకు ఉద్ధవ్ థాక్రేకు గవర్నర్ ఆదేశం

Publish Date:Jun 29, 2022

Advertisement

మహా రాజకీయ సంక్షోభం ముగింపు దశకు వచ్చినట్లేనా? ఇక రేపో మాపో రాష్ట్రంలో అధికారం చేపట్టేదెవరో..  కొనసాగేదెవరో తేలిపోనున్నదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మహారాష్ట్రలో రాజకీయ ఉత్కంఠకు ఇక తెరపడే సమయం ఆసన్నమైందనే అంటున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం అంటే జూన్ 30న సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ మేరకు గవర్నర్ ఉద్ధవ్ థాక్రేను ఆదేశించారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై స్టే ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగకుండా ఆదేశాలివ్వాలన్న ఉద్ధవ్ వినతిని సుప్రీం కోర్టు తిరస్కరించడంతో ఆయన గవర్నర్ ఆదేశాలను పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్ధవ్ థాక్రే తన ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఆయన గురువారం సాయంత్రం 5 గంటల లోపు సభలో తన బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. బీజేపీ సహా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

అయితే బల నిరూపణపై స్టే కోసం ఉద్ధవ్ థాక్రే మరోసారి సుప్రీంను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ఇన్నాళ్లూ తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేకు, ఆయనతో పాటు ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలకూ తెరవెనుక ఉండి అండగా నిలబడిన బీజేపీ ఇప్పుడిక తెరముందుకే వచ్చేసింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ నేతలు ప్రత్యక్షంగా కార్యాచరణకు ఉపక్రమించారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హస్తిన వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

హస్తిన నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఫడ్నవీస్ మహారాష్ట్ర గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినందున వెంటనే అసెంబ్లీని సమావేశ పరిచి ఉద్ధవ్ థాక్రే బలపరీక్షకు ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఇండిపెండెంట్లు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదంటూ గవర్నర్ కు తెలియజేయడమే కాకుండా ఈ మేరకు ఓ లేఖ కూడా ఆయనకు అందజేశారు.

ఇండిపెండెంట్లు వేరుగా గవర్నర్ కు మరో లేఖ పంపారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభలో బల నిరూపణ చేసుకోవలసిందిగా సీఎం ఉద్ధవ్ థాక్రేను ఆదేశించారు. ఇందు కోసం గురువారం అసెంబ్లీని సమావేశ పరిచి, సాయంత్రం ఐదుగంటలలోగా బలాన్ని నిరూపించుకోవలసిందిగా గడువు నిర్దేశించారు.  

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.