Publish Date:Apr 20, 2024
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో భారత్ లో పర్యటించాల్సిన మస్క్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఏడాది చివరిలో మాత్రం తప్పకుండా ఇండియాలో పర్యటిస్తానని మస్క్ తన పర్యటన వాయిదా ప్రకటన సందర్భంగా చెప్పారు. ఈ వార్త వినగానే ఏపీ ప్రజలలో ఆనందం, హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఎలాన్ మస్క్ పర్యటన వాయిదాకు, ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేయడానికి ఏమిటి సంబంధం అంటారా? అక్కడికే వద్దాం ఆగండి!
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ లొ ఇన్వెస్ట్ చేయలేదు. ఇందుకు కారణం దేశంలో అధికంగా ఉన్న పన్నులే కారణమని ఇప్పుడు కాదు ఎప్పుడో 2021లోనే చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత్ ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించింది. స్థానికంగా పెట్టుబడులు పెట్టి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని దేశంలో ప్రారంభించే సంస్థలను ఆహ్వానించడం, ప్రోత్సహించడం కోసం ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎలాన్ మస్క్ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. అందుకే ఆయన భారత పర్యటన పెట్టుకున్నారు. ఈ సంగతి తెలియగానే పలు రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు సన్నాహాలు ఆరంబించేశాయి. దేశంలో ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్నా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచార హడావుడిలో నిండా మునిగిపోయి ఉన్నా.. రాష్ట్ర ప్రగతి కోసం మస్క్ పర్యటన సందర్భంగా టెస్లాతో ఒప్పందం కోసం సన్నాహాలు ప్రారంభించేశారు.
అయితే ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం అందుకు సంబంధించి ఇఫ్పటి వరకూ ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం రాష్ట్రంలోని టెస్లాను ఆహ్వానించే విషయంలో సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన సందర్భంగా ఏపీ వైపు ఆయన దృష్టి సారించే అవకాశాలు దాదాపు మృగ్యం అన్న భావనకు అంతా వచ్చేశారు. ఈ సందర్భంగా జగన్ హయాంలో రాష్ట్రం వైపు చూడటానికే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు భయపడిన వైనాన్ని పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. దీంతో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా పడటం సహజంగానే ఏపీ వాసులకు ఆనందం కలిగించింది.
ఈ ఏడాది చివరిలో ఎలాన్ మస్క్ భారత పర్యటనకు రానున్నారు. అంటే అప్పటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చే నెల 13న రాష్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలలో జగన్ పార్టీ పరాజయం పాలై తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు సీఎం అయితే టెస్లా పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువచ్చిన చంద్రబాబు.. టెస్టాను కూడా ఏపీకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎలాన్ మస్క్ ఇండియా పర్యటన ఈ ఏడాది చివరకు వాయిదా పడటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/elonmusk-india-tour-postponed-39-174193.html
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది.
ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి
రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి హేమాహేమీలు తలపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రస్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్లో వున్న రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజకీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.