నిర్మలమ్మ బడ్జెట్ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగిరానున్నాయి. లిథీయం బ్యాటరీలపై పన్ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో ప్రకటించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశలు ఉన్నాయి. విద్యుత్ సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వాల కీలక భాగస్వామ్యం అవసరమని విత్త మంత్రి తన బడ్జెట్ లో పేర్కొన్నారు.
ఎంఎస్ఎంఈలపై వరాల వర్షం
కేంద్ర ఆర్థిక మంత్రి లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఎంఎస్ఎంఈలకు వరాల వర్షం కురిపించారు. వీటికి ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేశారు. అంటే ఇప్పటి వరకూ ఇస్తున్న ఐదు కోట్ల రుణాలను పది కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇక నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నగరాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కనెక్టివిటీ పెంచేందుకు కొత్తగా 117 విమానాశ్రయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవి వచ్చే పదేళ్లలో అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇక పర్యాటక ప్రదేశాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే అంతర్రాష్ట్ర విద్యుత్తు పంపిణీ కోసం కొత్త ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. మధ్య తరగతి ప్రజల కోసం 40 వేల ఇళ్లు నిర్మిస్తామన్నారు. అలాగే మెడికల్ టూరిజం అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు ఇస్తామని చెప్పారు. ఇక బీహార్ రాష్ట్రానికి వరాల వర్షం కురిపించారు. బీహార్ లోని నికలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే బీహార్ రాష్ట్రానికి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/electric-vehicles-prices-come-down-39-192193.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!