మహోగ్రరూపం దాల్చిన తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం సందర్శన నిలిపివేత.!

Publish Date:Jul 29, 2026

Advertisement

తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన  బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లాలోని ఈ బొగత జలపాతం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో  ఆకట్టుకునే ఈ బొగత జలపాతం ప్రస్తుతం ఒకే సమయంలో అద్భుత ప్రకృతి అందం, జల ప్రళయాన్ని తలపింపచేసే  ఉగ్రరూపంతో భయపెడుతోంది. 

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ ప్రాంతం ఇప్పుడు   అధికారులకు  సవాలుగా మారింది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు ప్రతిరోజూ బొగత జలపాతాలను తిలకించడానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా అధికారులు పర్యాటకులను అనుమతించడంలేదు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం ప్రభావంతో గ  దట్టమైన అటవీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భాకీగా నీరు బొగత జలపాతంలోకి  చేరడంతో బొగత వద్ద నీటిమట్టం   ప్రమాదకర స్థాయికి పెరిగింది. సాధారణంగా ప్రశాంతంగా, సుందరంగా కనిపించే ఈ తెలంగాణ నయాగరా ఇప్పుడు  నీటి ప్రవాహంతో హోరెత్తుతోంది. నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే, చాలా దూరంలో ఉన్నవారికి కూడా ఆ శబ్దం ఎంతో స్పష్టంగా  వినిపిస్తోంది.

ఈ భారీ ప్రవాహం వల్ల జలపాతం పరిసరాల్లో ఉన్న  రాళ్లు జారే ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన అధికారులు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని  బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు  ప్రకటన విడుదల చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అటవీ  సిబ్బంది, పోలీసులు కలిసి జలపాతం వద్ద భద్రతను   పెంచారు. ఎవరూ నీటి వద్దకు వెళ్లకుండా దారి పొడవునా  బారికేడ్లను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా పర్యాటకులను హెచ్చరిస్తూ వెనక్కి పంపుతున్నారు. 

Bogatha Waterfalls,  Mulugu Heavy Rains, Bogatha Floods, Wazeedu Cheekupally, Bogatha Entry Closed

By
en-us Political News

  
ప్రభుత్వం చేపట్టిన బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎదురవుతున్న చిక్కులను తొలగిస్తూ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పాలమూరు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతొ ఆ ప్రాజెక్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ మెట్రో ప్రయాణం ఒక హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తన కాన్వాయ్‌ను పక్కన పెట్టి, సరాసరి మెట్రో స్టేషన్‌కు చేరుకుని సాధారణ ప్రయాణీకుడిలా క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణికుల మధ్య కూర్చుని పక్కన ఉన్న వారితో ముచ్చటించారు.
జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో ఏడాదంతా సాగునీటికి కొదవ ఉండదని రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వరద తాకిడికి పలు గ్రామాలు ముంపునకు గురికావడం, రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించడంతో సామాన్య జనం ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలోని ఎంపోరియాలో 1,000 ఎకరాల డేటా సెంటర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్‌లో చప్పట్లు కొట్టినందుకు లక్స్ క్లారిడ్జ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగ హక్కులు, 1 గిగావాట్ విద్యుత్ వివాదం మరియు ఈ సంచలన ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇక్కడ చదవండి!
గూగుల్ పేలోకి Gemini AI సాంకేతికతతో Ask Google Pay ఫీచర్ వచ్చింది. మీ ఖర్చులు, పొదుపు మార్గాలు మరియు CIBIL స్కోర్ వివరాలను 10 భారతీయ భాషల్లో సులభంగా తెలుసుకునే విధానం గురించి పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
AIG ఉమెన్స్ ఓపెన్ 2026 ప్రత్యక్ష ప్రసారాలు, నెల్లీ కోర్డా గ్రాండ్ స్లామ్ వేట, మియు యమషిత డిఫెండింగ్ రికార్డులు మరియు మ్యాచ్ సమయాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
2024 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా ఎంపికై, ప్రత్యేక సెలవులో ఉండటంతో 2025 బ్యాచ్‌తో కలిసే శిక్షణలో చేరారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది.
కాకినాడ జిల్లాకు చెందిన దర్జీ కుమారుడు మాల్తి అఖిలేశ్ సంచలన విజయం సాధించాడు. కెనడా ఏఐ సంస్థలో ఏడాదికి రూ. 1.06 కోట్ల ప్యాకేజీతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పొందిన స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ చదవండి.
బెంగళూరులో రూ.2.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువైన లగ్జరీ ఇళ్లను ఐటీ ఉద్యోగులు ఎలా కొనుగోలు చేస్తున్నారు రెడ్డిట్ వేదికగా వైరల్ అవుతున్న ఆసక్తికర వివరాలు, టెక్కీల అసలు సీక్రెట్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 9,275 కోట్ల మెగా ఐపీఓ పూర్తి వివరాలు తెలుసుకోండి. ప్రైస్ బ్యాండ్, లేటెస్ట్ జిఎమ్‌పి GMP , సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, అలకేషన్ తేదీలు మరియు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలు ఇక్కడ క్లియర్ గా చదవండి.
22వ కామన్‌వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాలు, మానవ్ ఠక్కర్ వీరోచిత పోరాటం, శ్రీజ అకుల థ్రిల్లింగ్ ప్రదర్శనతో భారత్ మలేషియాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది.
2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ ఆడటంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ భవిష్యత్తు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని, గిల్ ముందుకు వచ్చి మద్దతు ఇస్తేనే హిట్‌మ్యాన్ వరల్డ్ కప్ ఆడగలడని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ పతకాల పంట పండించింది. దిలీప్ గావిత్ స్వర్ణ పతకం సాధించగా, మురళీ శ్రీశంకర్ లాంగ్ జంప్‌లో రజతంతో చరిత్ర సృష్టించాడు. బాక్సింగ్‌లో ఏకంగా 10 పతకాలు ఖాయమయ్యాయి. పూర్తి వివరాలు చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.