జగన్ నిర్వాకం..ఏపీలో విద్యావ్యవస్థకు గ్రహణం!

Publish Date:Jul 10, 2023

Advertisement

మనదేశంలో విద్యావ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అనేక రాష్ట్రాల్లో కార్పొరేట్‌ విద్యా వ్యవస్థలదే పైచేయి. అనాది నుండి మహాముహులు చదివిన స్కూళ్ళు, కాలేజీలు ఇప్పుడు వెనకబడిపోయాయి. ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు ఇప్పుడు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. ఒక పద్ధతి ప్రకారం చొచ్చుకొచ్చిన కార్పొరేట్‌ విద్యాసంస్థలు పిల్లల తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తూ కొత్త సంస్కరణలు రాసుకొచ్చాయి. ప్రభుత్వాల హెచ్చరికలను వారు ఖాతరు చేయరు.. ప్రభుత్వ సంస్కరణలనూ వాళ్ళు లెక్కచేయరు. దీంతో ఇప్పుడు పేదవాడికి విద్య దూరమవుతుంది. కొనగలిగిన వారికే సరస్వతీ చేరువవుతుంది. అందుకే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలను పునరిద్ధరుస్తున్నారు. సరికొత్త చట్టాలను తీసుకొచ్చి మరీ విద్యావ్యవస్థను బలీయం చేస్తున్నాయి. 

తెలంగాణ సహా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు కార్పొరేట్ విద్యకు చెక్ పెట్టేలా కొత్త విధానాలను అవలంభిస్తూ మళ్ళీ ప్రభుత్వ విద్యాసంస్థలకు పూర్వ కళ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఏపీలో మాత్రం విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ముందు చూపు లేని విధానాలు, మొండిపట్టు జీవోలు ఇప్పుడు పేద పిల్లల పాలిట శాపంగా మారాయి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా మూర్ఖత్వపు నిర్ణయాలు ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనానికి బాటలు వేశాయి. నాలుగేళ్ళలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు పేరిట చేసిన మార్పులు, భారీగా టీచర్ల కొరత ఉన్నా నియామకాలు చేపట్టకపోవడం, ఉన్న టీచర్లు, లెక్చరర్లకు జీతాల కొరత, పాఠశాలల విలీనం, ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కు పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వ కళాశాలలకు కేటాయించని నిధులు.. ఇలా చెప్పుకుంటూపోతే నాలుగేళ్ళ పాలనలో విద్యావ్యవస్థ నాశనానికి అనేక కారణాలు కనిపిస్తూనే ఉన్నాయి.

గత నాలుగేళ్ళ వైసీపీ పాలనలో కొత్తగా ఉపాధ్యాయ, లెక్చరర్ల నియామకాలు లేవు. ఉన్నవారిని కుదించి సర్దుబాటు చేస్తున్నారు. ఉన్న వారికి న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు అందడం లేదు. వచ్చే ఆ జీతాలు కూడా సమాయానికి అందడం లేదు. దీంతో వారు రోడ్డెక్కాల్సిన దుస్థితి. దీనికి తోడు ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండా తీసుకొచ్చిన 172, 117 రెండు జీవోలు ఏపీ విద్యావ్యవస్థను సర్వనాశనం చేశాయి. పాఠశాలల విలీనం పేరుతో అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసిన జగన్ సర్కార్.. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించేశారు. దశాబ్దాలుగా గ్రామంలో పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన బడులను సైతం మూసేసి.. కిలోమీటర్ల దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అది కూడా మాతృభాష ఊసు లేకుండా ఒక్క ఇంగ్లీష్ మీడియంను ఉంచారు.  

ఇంగ్లీష్ మీడియం తెచ్చినా.. అందుకు తగిన ప్రొఫెషనల్ టీచర్లు లేకపోవడంతో అది అక్కరకురాని మీడియం మారిపోయింది. ఇక కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు లేకపోగా టీచర్, స్టూడెంట్స్ నిష్పత్తిని తెరపైకి తెచ్చారు. ప్రాథమిక పాఠశాలలో ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడ్ని నియమించారు. అదే ప్రాథమికోన్నత పాఠశాలకు అయితే ప్రతీ 53 మంది విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో ప్రతీ 60 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు మార్చారు. మరి అంత మంది విద్యార్థులకు ఒకరే ఉపాధ్యాయుడు విద్యాబోధన ఎలా చేయగలరో.. వారిపై ఎంతవరకు టీచర్లు దృష్టి పెట్టగలరో అనే మేధావుల ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. 

ఇక వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అట్టర్ ప్లాప్ కార్యక్రమాలలో నాడు నేడు కూడా ఒకటి. లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం.. ఫోటో ఫోజులకు తప్ప ఈ కార్యక్రమం ఎందుకు పనికిరాకుండా పోయింది. రూ.వేల కోట్లు ఖర్చు చేసి పాఠశాలల్లో బెంచీలు, కుర్చీలు వేశారు. మరికొన్ని పాఠశాలల్లో నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కొన్ని స్కూల్స్ లో పైపై మెరుగులు దిద్ది, రంగులేసి భారీగా నిధులను కొల్లగొట్టారు. అయితే, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రంగులు వేసుకొని ఆనందం పొందడమే తప్ప పాఠశాలలకు విద్యార్థులను రప్పించే ఏర్పాట్లు చేయలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం ఇకపై విద్యారులు ఇక్కడే చేరండని ఏపీ ప్రభుత్వం నమ్మకం కలిగించలేకపోవడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.