తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. అయితే గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ సారి స్వయంగా విద్యాశాఖమంత్రి పరీక్షల ఏర్పాట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే నెల నాలుగు నుంచి ఇరవై మూడు వరకు (మార్చి 4-23) ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 1339 సెంటర్ లలో 24,740 మంది ఇన్విజిలేటర్ లను నియమించింది.
గతేడాది ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పై చెలరేగిన వివాదంతో రాష్ట్రం అట్టుడికింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను కుదిపేశాయి. దీంతో ఈ సారి ఇంటర్ పరీక్షల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. పేపర్ వ్యాల్యూషన్ పై గతేడాది జరిగిన పొరపాట్లు మరలా పునరావృతం కాకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కలెక్టర్ అధ్యక్షతన హై పవర్ కమిటీ ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పరీక్షల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని ఆదేశించారు. రెవిన్యూ పోలీస్, ఆర్టీసీ, వైద్య, విద్యుత్తు శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ లను కోరారు. పరీక్షల సమయంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులు, తల్లితండ్రులు పరీక్షల నిర్వహణ ఫలితాలపై ఆందోళన చెందొద్దని కోరారు. విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్షల ప్రారంభానికి ముందు చేయాల్సిన మిగతా అన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది తెలంగాణ సర్కార్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/education-minister-sabitha-indra-reddy-reviews-arrangements-for-inter-exams-39-93979.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.