రాజ్ కేసిరెడ్డి అరెస్ట్.. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరో తెలుసా?!

Publish Date:Jun 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, అధికార వర్గాలను కుదిపేసిన  మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా, వైసీపి ఎన్నారై విభాగంలో కీలకంగా  వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం (జూన్ 11)  అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పదికి పైగా కీలక ప్రాంతాల్లో ఒకేసారి విస్తృతంగా సోదాలు నిర్వహించిన అనంతరం రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేయడం గమనార్హం.    ఈ కుంభకోణంపై ఏర్పాటైన ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాటకీయ పరిణామాల మధ్య  రాజ్ కేశిరెడ్డిని గతే ఏడాది ఏప్రిల్‌లోనే అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి  ఏడాది   జైలులోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ..  ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడం రాజకీయవర్గాలలోకలకల రేపుతోంది.  

గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా,  ఈడీ ఎంట్రీ తో కథ  కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్  గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే సిగ్మా సప్లై చైన్, టెక్కర్ వంటి బినామీ సంస్థల ద్వారా సాగిన  మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు సంస్థ  ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే సుమారు 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ   అటాచ్ కూడా చేసింది. 

ఏపీ మద్యం కుంభకోణంలో  దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల తీరు గమనిస్తుంటే, ఈ బాగోతం తాలూకు వేళ్లు అల్టిమేట్‌గా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయనే చర్చ రాజకీయ  జోరుగా నడుస్తోంది. రాజ్ కేసిరెడ్డి గత ప్రభుత్వంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి  అత్యంత సన్నిహితుడిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో వైసిపి సీనియర్ నేత  విజయసాయిరెడ్డి సైతం ఈడీ విచారణకు హాజరైనప్పుడు, మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు సర్వస్వం రాజ్ కేసిరెడ్డికే తెలుసని..  ఆయనే దీనికి అసలైన మాస్టర్‌మైండ్ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డి వ్యక్తిగతంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఆఫీస్ నుంచే ఈ భారీ వసూళ్ల నెట్‌వర్క్ అంతా నడిచిందని అధికారులు పక్కాగా గుర్తించారు.

ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ఈడీ కస్టడీలోకి వెళ్లడంతో ఈ మహా కుంభకోణం తాలూకు అసలైన లబ్ధిదారులు ఎవరనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. . వైసీపికి చెందిన ఒక సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడితో పాటు మరికొందరు కీలక నేతలకు చేరినముడుపుల) గుట్టు ఇప్పటికే ఛేదించిన ఈబీ..  ఈ మనీలాండరింగ్ లింకుల ఆధారంగా, రానున్న రోజుల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా విచారణకు పిలుస్తూ.. నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా ఉండగా రాజ్ కేసిరెడ్డి అరెస్టు తరువాత ఈడీ లక్ష్యం ఎవరన్న ఆసక్త కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
ఈ గ్లోబల్ మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 దేశాలకు చెందిన 12 వేల మందికి పైగా విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలపై ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్ట్ మూల్యాంకన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది బాలికలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న తుది ఎంపిక ప్రక్రియలో ఇండియా నుంచి 20 మంది విద్యార్థినులు స్థానం సంపాదించగా, వారిలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జెస్సీ నిలవడం గర్వకారణం.
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.