రాజ్ కేసిరెడ్డి అరెస్ట్.. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరో తెలుసా?!

Publish Date:Jun 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, అధికార వర్గాలను కుదిపేసిన  మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా, వైసీపి ఎన్నారై విభాగంలో కీలకంగా  వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం (జూన్ 11)  అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పదికి పైగా కీలక ప్రాంతాల్లో ఒకేసారి విస్తృతంగా సోదాలు నిర్వహించిన అనంతరం రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేయడం గమనార్హం.    ఈ కుంభకోణంపై ఏర్పాటైన ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నాటకీయ పరిణామాల మధ్య  రాజ్ కేశిరెడ్డిని గతే ఏడాది ఏప్రిల్‌లోనే అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి  ఏడాది   జైలులోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ..  ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడం రాజకీయవర్గాలలోకలకల రేపుతోంది.  

గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా,  ఈడీ ఎంట్రీ తో కథ  కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్  గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే సిగ్మా సప్లై చైన్, టెక్కర్ వంటి బినామీ సంస్థల ద్వారా సాగిన  మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు సంస్థ  ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే సుమారు 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ   అటాచ్ కూడా చేసింది. 

ఏపీ మద్యం కుంభకోణంలో  దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల తీరు గమనిస్తుంటే, ఈ బాగోతం తాలూకు వేళ్లు అల్టిమేట్‌గా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయనే చర్చ రాజకీయ  జోరుగా నడుస్తోంది. రాజ్ కేసిరెడ్డి గత ప్రభుత్వంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి  అత్యంత సన్నిహితుడిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో వైసిపి సీనియర్ నేత  విజయసాయిరెడ్డి సైతం ఈడీ విచారణకు హాజరైనప్పుడు, మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు సర్వస్వం రాజ్ కేసిరెడ్డికే తెలుసని..  ఆయనే దీనికి అసలైన మాస్టర్‌మైండ్ అని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డి వ్యక్తిగతంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఆఫీస్ నుంచే ఈ భారీ వసూళ్ల నెట్‌వర్క్ అంతా నడిచిందని అధికారులు పక్కాగా గుర్తించారు.

ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ఈడీ కస్టడీలోకి వెళ్లడంతో ఈ మహా కుంభకోణం తాలూకు అసలైన లబ్ధిదారులు ఎవరనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. . వైసీపికి చెందిన ఒక సిట్టింగ్ లోక్‌సభ సభ్యుడితో పాటు మరికొందరు కీలక నేతలకు చేరినముడుపుల) గుట్టు ఇప్పటికే ఛేదించిన ఈబీ..  ఈ మనీలాండరింగ్ లింకుల ఆధారంగా, రానున్న రోజుల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా విచారణకు పిలుస్తూ.. నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా ఉండగా రాజ్ కేసిరెడ్డి అరెస్టు తరువాత ఈడీ లక్ష్యం ఎవరన్న ఆసక్త కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు భారతీయ నావికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.