దసరా చెప్పే కబుర్లు..

Publish Date:Oct 8, 2016

Advertisement

భారతీయ జీవనంలో పండుగలు ముఖ్యమైన భూమికలు. అవి మన జీవితాల్లో సందడిని మాత్రమే కాదు. మనసుల్లోకి వెలుగుని కూడా తీసుకువస్తాయి. అలా దసరా నేర్పే కొన్ని మంచి విషయాలు…

 

దశహర:

రావణాసురుడిని రాముడు దసరా రోజునే సంహరించాడట. దశ కంఠుని హరించాడు కాబట్టి `దశ హర` అనే పేరుమీదుగా దసరా వచ్చిందని కూడా ఓ నమ్మకం. ఇంతకీ రావణాసురునికి పదితలకాయల వెనుక ఏదన్నా అంతరార్థం ఉందా అంటే ఒక్కొక్కరూ తమకి తోచిన జవాబుని చెబుతారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల (మొత్తం కలిపి 10) మీదా అదుపులేనివాడు అన్న సూచనే పది తలలు అని కొందరు; అరిషడ్వర్గాలతో పాటు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాలకి పది తలలు ప్రతీక అని మరి కొందరు అంటారు. ఎవరు ఎలా నిర్వచించినా రావణాసురుడు విపరీతమైన అహంకారానికి ప్రతీక అన్నది మాత్రం అందరూ ఒప్పుకునేదే! అలాంటి విపరీతమైన అహంకారం మన పీకలమీదకి వస్తుందనీ, ఆ అహంకారాన్ని జయించిన ప్రతివాడూ దైవసమానుడనీ తెలియచేస్తుంది దసరా!

 

మహిషాసురుడు:

ఒకరిలో చలనం లేకపోతే `దున్నపోతు మీద వానపడినట్లు` అంటాము. ఒకరిలో సంస్కారం లేకపోతే `మనిషా దున్నపోతా!` అని తిట్టుకుంటాం. మొత్తానికి మందకొడితనం, అజ్ఞానం, విచక్షణ లేకపోవడానికి మనం దున్నపోతునే ఉదాహరణగా తీసుకుంటాం. అలాంటి మహిషంతో అమ్మవారు తలపడిన రోజులే ఈ నవరాత్రులు. మన జీవితాల్లోనూ మహిషానికి ప్రతిరూపాలైన లక్షణాలను తరిమికొట్టాలని ఈ పండుగ చెబుతోంది. స్పందించే గుణం, వివేకం లేకపోతే మన జీవితాలు వృథాగా వెల్లమారిపోతాయి కదా!

 

 

అజ్ఞాతవాసం:

మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసాన్ని మరో ఏడు అజ్ఞాతవాసాన్నీ గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపడం కోసం విరాటరాజు కొలువులో, అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాటనగరం మీదకి దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మిచెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీశారు. ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ ఆయుధపూజను చేయడం పరిపాటి. ఎంతటివారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమతమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధపూజ చెబుతున్న మాట!

 


 

దసర/సరద: తెలుగులోని పదాలకు దీర్ఘాలు, ఒత్తులు ఉండటం వల్ల వాటిని`జంబిల్‌` చేసే అవకాశం తక్కువ. కానీ దసర అన్న పదాన్ని జంబిల్‌ చేస్తే సరద అని వస్తుంది. దసరా అంటేనే లోకం మొత్తానికీ సరదా కదా! అటు వానాకాలం, ఇటు చలికాలం కాకుండా ప్రకృతి మొత్తం ఆహ్లాదంగా ఉంటుంది. పండుగకి పుట్టిళ్లు చేరుకున్న ఆడపడుచులతో గడపలన్నీ కళకళలాడతాయి. ప్రతీ ప్రాంతం వాళ్లూ తమకి తోచిన రీతిలో పండుగను జరుపుకొంటారు. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు, విజయనగరంలో సిరిమాను సంబరాలు, కృష్ణాజిల్లాలో శక్తిపటాలు, బెంగాల్లో అమ్మవారి పందిళ్లు, తమిళనాడులో బొమ్మల కొలువులు… ఇలా పదిరోజుల పండుగని ధూంధాంగా చేసుకుంటారు జనం. ఆ పండుగ సందడి కలకాలం నిలవాలనీ, జీవితం సరదా సరదాగా గడిచిపోవాలనీ కోరుకుంటోంది దసర!

 

- నిర్జర.

By
en-us Political News

  
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.