రోడ్డు ప్రమాదంలో డీటీవో వెంకన్న దుర్మరణం
Publish Date:Jun 22, 2026
Advertisement
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి డీటీవో వెంకన్నన దుర్మరణం చెందారు. విధినిర్వహణలో భాగంగా రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తున్న వెంకన్నను ఒక బొగ్గు టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. పరకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరకాల వైపు నుంచి భూపాలపల్లి వైపు వస్తున్న ఒక బొగ్గు టిప్పర్ అతివేగంగా దూసుకొ డీటీఓ వెంకన్నను ఢీకొంది. వెంకన్న 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు బాధ్యతలు చేపట్టారు. సమాచారంఅందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొగ్గు టిప్పర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా, ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. విధినిర్వహణ లో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
http://www.teluguone.com/news/content/dto-venkanna-killed-in-road-accident-36-223729.html





