రాజకీయ నాయకులకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలి!

Publish Date:Apr 3, 2026

Advertisement

రాజకీయాలు, అవినీతి, సామాజిక అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్, జమీన్‌రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ నిర్వహిస్తున్న సంచలనాత్మక చర్చా కార్యక్రమం వాస్తవ వేదిక విజయవంతంగా కొనసాగుతోంది. తాజా సంచికలో   తెలుగు రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలపై విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.  రాజకీయ నేతలు సమాజానికి రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన తరుణంలో, వారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ వ్యసనం బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి వాడుకుంటున్నాయే తప్ప, మూలాల నుంచి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వారి అనుచరులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, అది   మీడియా చర్చలకే పరిమితమవుతోంది తప్ప వారికి కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు దాదాపు లేదన్నారు. 

డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవనీ,  ఇందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు,  రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల డ్రగ్స్ కేసుల విచారణలు తరచుగా నీరుగారిపోతున్నాయని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ లు అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే..  డ్రగ్స్ వినియోగాన్ని చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణించకపోవడం కూడా డ్రగ్స్ వినియోగం నిర్మూళనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ అమ్మడం నేరం కానీ, తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణించడం లేదనీ,  దీనివల్ల నిందితులు సులభంగా బయటపడే అవకాశం ఉందన్నారు. 

రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక నూతన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించినట్లే, తాము డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నామని నిరూపించుకోవడానికి  డోప్ టెస్ట్'  నివేదికలను సమర్పించే నిబంధనను తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికలను బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంచాల్సి ఉందన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక సానుకూల సందేశాన్ని పంపుతుందన్నారు. 
 
రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని రవిశంకర్ పేర్కొన్నారు.  డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని రాజకీయాల నుంచి బహిష్కరించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొన్న 'ఉడ్తా పంజాబ్' వంటి దుస్థితి తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే, రాజకీయ నేతలు స్వచ్ఛందంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనీ, రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాకుండా, సామాజిక బాధ్యతను నెరవేర్చే వేదికలుగా మారినప్పుడే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమౌతుందనీ డోలేంద్రప్రసాద్, రవిప్రసాద్ లు పేర్కొన్నారు.  

By
en-us Political News

  
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.