రాజధానిలో మరోసారి డ్రగ్స్ కలకలం

Publish Date:May 17, 2024

Advertisement

హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ రాజశేఖర్, శైలేష్‌ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.అలాగే తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి ఎస్‌వోఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రోహిత్‌, తిలక్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3 గ్రాముల ఎంఎండీఏ ప‌ట్టుబ‌డింది. దాంతో ఆ ఇద్ద‌రిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు.ఇటీవల కాలంలో హైదరాబాద్ డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారింది. మూడు నెలల క్రితం గసగసాల గడ్డితో తయా చేసిన గడ్డిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గడ్డి సేవిస్తే మంచి కిక్ వస్తుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోతూనే ఉంది. చాపకింద నీరులా గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం చర్చనీయాంశమైంది.  

By
en-us Political News

  
కూటమిదే భారీ విజయం: జనగళం
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో తెలుగుదేశం హవానే సూచిస్తున్నాయి. దాదాపు వందకు పైగా స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. ముందుగా పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలుగుదేశం కూటమికి 125 స్థానాలు, వైసీపీకి 50 స్థానాలు వస్తాయి.
టీడీపీ కూటమికే ఘన విజయం దక్కనుందని రైస్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. తెలుగుదేశం కూటమికి 113 నుంచి 122 సీట్లు వస్తాయిని, వైసీపీకి 48 నుంచి 60 సీట్లు వస్తాయని, ఇతరులు ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం వుందని రైస్  సర్వే వెల్లడించింది.
కేకే సర్వే కూడా కూటమి వైపే.. వైసీపీకి 14 సీట్లే!
కూటమిదే ఘన విజయం: పీపుల్స్ పల్స్ సర్వే
ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసి దాదాపు ఇర‌వై రోజులు కావొస్తున్నది. ఎన్నిక‌లు ముగిసిన నాటి నుంచి మేమే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని తెలుగుదేశం, వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోసారి జ‌గ‌న్ సీఎం అవుతార‌ని వైసీపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ.. పోలింగ్ స‌ర‌ళిని చూస్తే అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌టంతో ప్ర‌జ‌లు విసిగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్డీయే కూటమిదే పైచేయి అని చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది.
జగన్ ఎన్ని బటన్లు నొక్కినా, ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈవీఎంలలో కూటమి బటన్ నొక్కాడని తెలిసిపోయింది. తెలుగుదేశం కూటమిదే ఘన విజయం అని పయనీర్ పోస్ట్ పోల్ సర్వే స్పష్టం చేసింది
ఎన్నికల ఫలితాలు సరిగ్గా మూడు రోజుల్లో వెలువడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా సాగాయని చెబుతున్నారు. అయితే సర్వేలు, అంచనాలూ తెలుగుదేశం కూటమికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఖాయమని చెబుతున్నాయి. పోలింగ్ తరువాత నుంచీ వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే వారికి కూడా రాబోయేది ఓటమే అది కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు ఘోర పరాజయం అన్న సంగతి తెలిసిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇక మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు.
ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలుపెరుగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరినీ కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి, హోదాకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు.
వైసీపీ రౌడీ, గూండా బిడ్డల్లారా.. పోలింగ్ రోజున ఓవర్ యాక్షన్ చేయకుండా ఎవరి ఇళ్లలో వాళ్ళు పడి వుండండి.. బయటకొచ్చి ఏదైనా అతి చేశారో... పోలీసులని చూశారుగా.. తుక్కుతుక్కు అయిపోతారు జాగ్రత్త!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.