గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితురాలు అరెస్ట్

Publish Date:Dec 30, 2025

Advertisement

 

గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంజారాహిల్స్‌కు చెందిన హస్సా అనే మహిళను  తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుండి MDMA మరియు LSD బ్లాట్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, రోడ్ నెం.3, గెలాక్సీ మొబైల్ షాప్ సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో. ఆమెను విచారించగా, మాదకద్రవ్యాల వినియో గానికి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హస్సాను అరెస్టు చేసిన అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెత్ మరియు ఆంఫెటమైన్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. 

దీంతో ఆమె కేవలం వినియోగదారురాలే కాకుండా, డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో హస్సా చెప్పిన విషయాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. హస్సా డిసెంబర్ 2024లో బస్సులో గోవాకు వెళ్ళానని, అక్కడ హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన మీనా మరియు ఆమె స్నేహితుడు కిరణ్‌ను కలిసినట్లు వెల్లడించింది. గోవాలోని మెర్మైడ్ హోటల్‌లో కలిసి బస చేసి, వాగేటర్ బీచ్, వాగేటర్ క్లబ్‌లకు వెళ్లినట్లు తెలిపింది. అక్కడే, మీనా ద్వారా సియోలిమ్ (గోవా)కు చెందిన రోమి భరత్ కళ్యాణి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. 

ఆ సమయంలో రోమి ఇచ్చిన పసుపు రంగు పొడిని డ్రగ్‌గా వినియోగించినట్లు అంగీకరించింది. డిసెంబర్ 2025లో జరిగిన పర్యటనల్లో కూడా రోమి లేదా అతని మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్ లావాదేవీలు జరిగినట్లుగా హస్సా పోలీసులకు వివరించింది.డిసెంబర్ 26, 2025న, సియోలిమ్ మరియు అనంతరం మాపుసాలో రోమి వ్యక్తిగతంగా కలసి MDMA మరియు LSD బ్లాట్స్‌ను అందించినట్లు హస్సా తెలిపింది. కొన్నిసార్లు హైదరాబాద్‌కు చెందిన సుమిహా ఖాన్, వజీర్ బాక్సర్ వంటి పరిచయస్తులతో కలిసి డ్రగ్స్ వినియోగించినట్లు కూడా హస్సా అంగీకరించింది.

By
en-us Political News

  
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది.
చుట్టూ ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువును క‌బ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది.
సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో అమాయకులు చేస్తున్న చిన్న తప్పిదాలు, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని కేసుల గ్రహణం వీడటం లేదు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
కొత్త సంవత్సర వేడుకలు దృష్ట్యా హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్‌పై ఏసీబీ దర్యాప్తు మరింత వేగవంతం చేశారు.
తెలంగాణలో 3 శాతం సైబర్ నేరాలు తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
ఏపీ గ్రూప్-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
వన్యప్రాణి మాంసం విక్రయిస్తూ ఓ నిందితుడు ఎస్ఓటి పోలీసుల చేతికి చిక్కిడు
శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌తో.. ఈ ఏడాదికి గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పాలనుకొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.