ఇంతకాలం లేని సమస్య ఇప్పుడే ఎందుకు? కేసీఆర్ వరి యుద్ధంపై అనుమానాలు

Publish Date:Mar 26, 2022

Advertisement

అంతా అదే.. సేమ్ టూ సేమ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో... ఎక్కడా ఎలాంటి మార్పు లేదు. అక్కడ కేంద్రంలో బీజేపీనే అధికారంలో వుంది. నరేంద్ర మోడీనే ప్రధానిగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో తెరాసనే అధికారంలో వుంది కేసీఆర్, అనే కల్వకుట్ల చంద్రశేఖర రావే, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికీ ఇప్పటికీ ధాన్యం సేకరణ విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయా, అంటే అదీ లేదు. అయినా,ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వాల మధ్య వివాదం రాజుకుంది.
ఈ నేపధ్యంలో ఇంతవరకు లేని సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తింది? కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎందుకు ‘వరి’ మంటలు పుట్టిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బేజీపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస పార్టీల మధ్య ఇంత పెద్ద ఎత్తున ‘యుద్ధం’ ఎందుకు జరుగుతోంది?ఒకరిపై ఒకరు ఎందుకు సభ్యతా సంస్కారం పక్కన పెట్టి, దూషణలకు దిగుతున్నారు. నిజానికి ఇదేమి, భేతాళ ప్రశ్న కాదు. 

నిజానికి అసలు సమస్య ధాన్యం సేకరణ కానేకాదు. ధాన్యం సేకరణ విషయంలో కొత్తగా వచ్చిన్ సమస్య న్తూ ఏదీ లేదు.  భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ఎన్నో ఏళ్లుగా, ఎన్నో దశాబ్దాలుగా అనుసరిరిస్తున్న ధాన్యం సేకరణ పద్దతులనే ఇప్పటికీ, అనుసరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం అమలవుతోంది. పంజాబ్’కో విధానం, తెలంగాణకు మరో విధానం అమలు కావడం లేదు.అది పంజాబ్ అయినా,తెలంగాణ అయినా, ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకుని తదనుగుణంగా రైతుల నుంచి ధాన్యం సేకరించి, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేస్తుంది. ఇందుకు అయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇదే పద్దతిని, గత సంవత్సరం వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుసరించింది. ఏనాడూ, ఇదిగో ఈ ఇంబ్బంది ఉందన్న పాపాన పోలేదు. చక్కగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చికాగోరింకల్లా,చీకూచింతలు లేని సంసారం సాగిస్తూ వచ్చాయి.  

అయినా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రంపై కత్తులు దూస్తోంది? ఎందుకు ఒకరిపై ఒకరు బురద జల్లు కుంటున్నారు? అయినా, అసలు గడచిన ఏడేళ్ళలో ఎప్పుడైనా, రైతులు పండించిన పంటను కొనేది, రాష్ట్రం కాదు కేంద్రం అనే మాట ఎక్కడైనా వినిపించిందా?  రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ (సంధానకర్త)గా మాత్రమే వ్యవహరిస్తుందని, ముఖ్యమంత్రి కానీ, మాత్రులు కానీ, ఏనాడైనా చెప్పారా? లేదే, పైగా ముఖ్యమంత్రి స్వయంగా శాసనసభలో రైతులు ఎంత పంట పండించినా హ్యాపీ గా కొంటామని, ప్రకటించారు.మరి ఇప్పుడు ఎందుకు ఇలా...గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తామని ముఖ్యమంత్రి మాట మార్చారు? ఎందుకు, కేంద్రంతో కోరి కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అందుకు ఒకటే ఒక్క కారణం కనిపిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్’లో మార్పు వచ్చింది. ఆయనలో ముందున్న విశ్వాసం సన్నగిల్లింది. ఇక సెంటిమెంట్’ పనిచేయదని తేలిపోయింది. అందుకే,కేసీఆర్  వ్యూహం మార్చారు, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, కేంద్రపై యుద్దాన్ని  ప్రకటించారని, పరిశీలకులు అంటున్నారు. 

అదొకటి అలా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ముప్పును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉహించి భయపడుతున్నరని అంటున్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం తదితర సాగునేటి ప్రాజెక్టుల నిర్మాణంలో, భూముల వ్యవహారంలో ఇతరత్రా చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తెరాస ప్రభుత్వ అవినీతిపై దృష్టి కేంద్రీకరించాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే. కీలక నేతలకు సంకెళ్ళు సిద్దమవుతున్న సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపద్యంలో ఆత్మరక్షణలో పడిన ముఖ్యమంత్రి కేసీఅర్’ కేంద్రం పై  యుద్ధం  పేరిట అసలు సమస్యలను, సవాళ్ళను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే, జరుగుతున్న పరిణామాలను గమినిస్తే, కేసీఆర్ కేంద్రంఫై ప్రకటించిన యుద్ధం’ బూమ్రాంగ్ అవుతున్న వైనమే కనిపిస్తోంది అనిపిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. అయితే, రేపు ఏమి జరుగుతుంది, అనేది మాత్రం ప్రస్తుతానికి ఎవరి అంతుచిక్కడం లేదని, అంటున్నారు.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.