భయం ఎందుకు.. పదండి ముందుకు...

Publish Date:Apr 12, 2018

Advertisement

 

ఓ చిన్న కథ చెప్పుకుందామా? అనగనగా అది ఒక ఊరు. ఆ ఊరు నుంచి పట్టణ ప్రాంతానికి వెళ్ళాలంటే ఓ కొండ దిగి అడవి దాటి వెళ్ళాలి. ప్రతీరోజు చాలామంది వ్యాపార పనుల మీద గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళిరావాల్సి వుంటుంది. ఒకరోజు కొంతమంది గ్రామస్థులు అలా ఆ కొండ దిగి అడవి దారి వెంబడి వెళుతుంటే ఎక్కడనుంచో గంట ఆగకుండా మోగుతూనే వుంది. చుట్టూ చూశారు వారి కాళ్ళకి ఏదో తగినట్టు అయ్యి చూస్తే  అక్కడ ఓ వ్యక్తి అస్థిపంజరం పడివుంది. దూరం నుంచి గంట మోత. ఒక్కసారిగా భయపడిపోయారు ఆ గ్రామస్థులు. ఒకటే పరుగు. గ్రామం చేరేదాకా ఆగలేదు. ఇలా గ్రామం చేరిన ఆ గ్రామస్థులు మిగతా వారితో వారు చూసినది, విన్నది చెప్పారు.


వారు చెప్పింది విన్న మిగతా గ్రామస్థులు కూడా ఆ శబ్దం ఏమయివుంటుంది... ఎలా వస్తోంది అని తర్జనభర్జన పడ్డారు. రకరకాల ఊహాగానాలు... అది ఏమయివుంటుందా అని. చివరికి ఎవరో అన్నారు అది గంటల రాక్షసి అయ్యివుంటుంది అని. అవునవును అంటూ మరికొందరు వత్తాసు పలికారు. దాంతో అందరూ మరింత భయపడిపోయి  ఇక ఆ రోజు నుంచి ఆ అడవి వెంబడి వెళ్ళటం మానేశారు. కానీ అలా ఎన్నాళ్ళని? గంటల శబ్దం అయితే ఆగటం లేదు. భయంతో గ్రామస్తులందరూ ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్నీ ఊరిపెద్దకి చెప్పారు కూడా. అయితే ఉన్నపళంగా అందరూ ఊరు ఖాళీ చేయటమంటే పొలాలు, ఇళ్ళు, అస్తులు ఏమవ్వాలి? ఏదయినా దారి వెతుకుదాం కొంతకాలం ఓపిక పట్టమన్నాడు గ్రామస్థులని.


అప్పుడు ప్రభావతి అనే గ్రామస్తురాలు ముందుకు వచ్చి నేను ఆ గంటల రాక్షసి సంగతి ఏంటో తెలుసుకుంటాను. అందరూ ఓపిక పట్టండని కొన్ని మామిడి పళ్ళు తీసుకుని అడవిదారి పట్టింది. అయితే గ్రామస్తులంతా హేళన చేశారు. నీవల్ల ఏం అవుతుంది అని. ప్రయత్నించటంలో తప్పులేదు కదా. ఆ రాక్షసి చంపితే నేను ఒక్కర్తినే చనిపోతాను. కానీ అది ఒట్టి భయమే అని తెలిస్తే అందరం బతుకుతాం అని ముందుకు కదిలింది ప్రభావతి. నిజానికి రాక్షసులు ఉండరని ప్రగాఢంగా నమ్మిన ప్రభావతి అసలు సంగతి తెలుసుకోవటానికి అడవి దారి పట్టింది.


అలా అడవి వైపు వెళ్తూ ప్రభావతి ఆలోచించటం మొదలు పెట్టింది. ఆ గంట శబ్దం వినిపించినప్పటి నుంచి నిజానికి ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. అంటే ఆ గంట ఏ జంతువులో మోగిస్తుండాలి. ఆ గంట శబ్దం వస్తున్న చోటికి వెళ్ళి తన వెంట తెచ్చిన మామిడి పళ్ళని వెదజల్లి ఓ చెట్టు చాటున దాక్కుంది. కాసేపటికి ఆ మామిడి పండ్ల వాసనకి ఓ కోతుల గుంపు అక్కడికి వచ్చింది. అందులో ఓ కోతి చేతిలో గంట వుంది. ఆ కోతి గంట పక్కన పడేసి పళ్ళు తింటుంటే నెమ్మదిగా గంట తీసుకుని గ్రామానికి చేరింది ప్రభావతి. గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు ప్రభావతి చెప్పింది విని. ఆ గంట తమ ఊరి చివర దేవాలయంలోనిదని గుర్తించారు.


ఆ దేవాలయంలో గంట దొంగిలించిన దొంగ అడవి గుండా పారిపోతుండగా పులి అతన్ని చంపి తినింది. ఆ గంట కోతులకి దొరికింది. తమాషా శబ్దం రావటంతో కోతులు ఆ గంటతో ఆడుతున్నాయి. గంటల రాక్షసి లేదు అని తెలుసుకున్న గ్రామస్థులు హాయిగా ఊపిరి తీసుకున్నారు. ప్రభావతిని మెచ్చుకున్నారు.


ఒకోసారి మనం కూడా ఏవో కొన్ని భయాలతో అడుగు ముందుకు వేయటానికి సందేహిస్తాం. అయితే ఆ ఒక్క అడుగు వేయగలిగితే చాలు ఇక అడుగుల వడి ఆగదని తెల్సినా ఆ ఒక్క అడుగే వెయ్యలేకపోతాం. కానీ చిన్న లాజిక్ ఆలోచిస్తే చాలు భయాలని ఈజీగా వదిలించుకోవచ్చు.


-రమ ఇరగవరపు

By
en-us Political News

  
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.