Publish Date:Jun 28, 2022
ఉన్నచోట అధికార పీఠం దరిదాపుల్లోకి వెళ్లలేని పార్టీ నాయకులు వేరే ప్రాంతాల్లో ఆవేశంగా తమ పార్టీని ప్రచారం చేసుకుని ప్రయోజనమేమిటి? హైదరాబాద్లో వేళ్లూనుకున్న ఎంఐఎం ఇక్కడ పాతబస్తీ మించి దాటలేని స్థితిలో వున్నది. కానీ ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యప్రదేశ్లో విస్తరించడానికి విశ్వ యత్నం చేస్తున్నారు. అక్కడ మొదటిసారిగా ఎన్నికల్లో పాల్గొంటున్న ఎంఐఎం పార్టీ అక్కడి మునిసిపల్ ఎన్నికల్లో గెలవడానికి కృషి చేయాలి, అక్కడి ఓటర్లను ఆకట్టుకోవాలి. అసలు అంతకుముందు అక్కడి ప్రజలకు అసదుద్దీన్ భావావేశం అర్ధం కావాలి. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కి నూక లు చెల్లిపోయాయి, ఆ పార్టీవారికి మద్దతు తెలపడంలో ఓటును దుర్వినియోగం చేసుకోవద్దని జబల్పూ ర్లో ఆవేశంగా మాట్లాడటంలో ఐవైసీ ఓటర్ల ను ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి. పైగా బిజెపి నాయ కత్వంలోని కేంద్రం పైనా సహజ రీతిలో విరు చుకుపడ్డారు. భారత సరిహద్దుల్లోకి చైనా సైన్యం చొచ్చుకు రావడాన్ని నిలువరించడంలో దారుణంగా విఫలమయిందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని విస్తరించుకోవడంలో భాగంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసి కాంగ్రెస్, బిజెపీ పట్ల తమ విముఖతను చాటుకోవడంలో అక్కడి ఓటర్లు, ప్రజలు నమ్మేస్తారనుకోవడం వొట్టి భ్రమే అవు తుంది. కాంగ్రెస్ పార్టీ చాలాకాలం నుంచి వున్నది, బిజెపి పార్టీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం వున్నది. ఈ రెంటిని అమాంతం నోటికి వచ్చినట్టు తిట్టేసి తన పార్టీని గెలిపించితే స్థానిక స్థాయి నుంచి తమ పార్టీవారు ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తారు అన్నది ఓటర్లకు తెలియజేసే పంథా తిట్టుడు ప్రచారంతో అవుతుందా అన్నది ఓవైసీ తెలుసుకోవాలి. హైదరాబాద్లోవలె మధ్యప్రదేశ్ జబల్పూర్ లోనూ పిచ్చిగా వెన్నంటే తిరుగుతారని అనుకోవడం తొందరపాటే అవుతుందని విశ్లేషకులు అంటు న్నారు.
కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, మోదీ ప్రభుత్వం సరిహద్దు అంశాలను నిర్ల క్ష్యం చేస్తున్నారన్నారు. దేశంలో ముస్లింలు అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యారంగంలో వెనుకబడి వున్నా రని దేశంలో విద్యావకాశాల పై అఖిల భారత సర్వే తెలియజేసిందన్నారు. దేశంలో ముస్లింల అభివృ ద్ధికి ప్రభుత్వాలు చొరవచూపాలన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-waste--vote-owaisi-39-138601.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.