Publish Date:Oct 17, 2022
రెండు పిల్లి పిల్లలు ఆడుతూ రోడ్డు మీదకి వెళిపోతోంటే కుక్క వచ్చి అమాంతం నోటితో పట్టి ఇవతలకు తెచ్చి పడేసింది. అపుడు నిజానికి వాటిని రోడ్డు మీదనే వదిలేయాలి. కానీ అలా చేయలేదు. దానిలో తల్లి ప్రేమ అలా చేయనీయలేదు. వాటి పరిస్థితి దానికి అర్దమయింది గనుక తీసుకువచ్చి ఓ గోడ దగ్గర పరిచిన దుప్పటి మీద పడేసి దగ్గరికి లాక్కుంది. అలా వెళ్లకం డమ్మా..చనిపోతారు..అన్నట్టు హెచ్చరించింది. వాటి తల్లి ఎటు వెళ్లిందో, చనిపోయిందో తెలీదుగాని కుక్కకి మాత్రం అవి అనాథ లన్నది అర్ధమయింది.
అనాధపిల్లల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. వీరి భవిష్యత్తు ఏమవుతుందని అనుకుంటాం. చాలామంది తల్లి మనసు వ్యక్తం చేస్తారు. కొందరే ముందుకు వచ్చి సాయం చేస్తారు. పిల్లల విషయంలో సాధారణంగా కుల,మత ప్రసక్తి లేకుండా ప్రేమను ప్రదర్శిం చడం పరిపాటి. ఇది జంతువుల్లోనే ఎక్కువ. కొన్ని పక్షులు వేరే పక్షుల గూటిలో గుడ్లుపెట్టడం గురించి విన్నాం. జంతువులు తమకు అస్సలు పడని జంతువుల పిల్లల్ని సమస్యలో ఉండగా చూస్తే వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇద ప్రకృతి విచిత్రం. పిల్లంటే కుక్కకి అస్సలు పడకపోవచ్చు. కానీ పిల్లి పిల్లలు అనాధగా పడి ఉంటే కుక్క వాటిని జాగ్రత్తగా చూసుకుంటూం టుంది. ఆఖరికి పెద్ద పిల్లి వచ్చినా వాటిని వదలదేమోనన్నంతగా ప్రేమిస్తాయి, తన పిల్లలంత ప్రేమగా చూసుకుంటాయి.
దీన్ని భారత్ మాజీ క్రికెట్ స్టార్ వివి ఎస్ లక్ష్మణ్ తన ట్విటర్లో పోస్టు చేశాడు. తన మనోహరమైన స్ట్రోక్ ఆటకు ప్రసిద్ధి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో హత్తుకునే వీడియోను పంచుకున్నారు. తల్లి పిల్లి మరణించిన తర్వాత కుక్క పిల్లి పిల్లలను చూసుకుంటున్నట్లు వీడియో చూపిస్తుంది.
పిల్లి తల్లి మరణించిన తర్వాత పిల్లి పిల్లలను చూసుకునే కుక్క తల్లి. మాతృత్వం అనేది మరొక వ్యక్తికి సర్వస్వం కావడంలో ఉన్న సున్నితమైన అసౌకర్యం అనే క్యాప్షన్తో లక్ష్మణ్ వీడియోలను షేర్ చేశాడు.
సమస్త జీవరాశుల తల్లులందరికీ కృతజ్ఞతలు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-run-away-like-that-kits-25-145606.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.