Publish Date:May 11, 2023
బావ.. ఎక్కడైనా బావే కానీ వంగతోట కాడ కాదన్నట్లు.... బాలినేని తనకు బావే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం కాదన్నట్లుగా ఆయన బావమరిది, టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారశైలి ఉందనే ఓ చర్చ ఒంగోలు నగరంలో సూపర్ స్పీడ్తో సవారీ చేస్తోంది. జగన్ తొలి కేబినెట్లో మంత్రిగా ఉండగా.. ప్రకాశం జిల్లాలో బాలినేని మాటారాజకీయమే.. బాటా రాజకీయమే.. . చివరకి ఆయన బర్త్ డే ఫంక్షన్ కూడా రాజకీయమే అన్నట్లుగా నడిచింది. ఇంకా చెప్పాలంటే... బాలినేని వాసన్న రాజకీయం అంతా స్మూత్గా.. సాఫ్ట్గా మూడో కంటికి తెలియకుండా నరుక్కోంటు వెళ్లిపోయేవారని.. అయితే బాలినేనికి మంత్రి పదవి హుళక్కి అయిన తర్వాత.. అప్పటి వరకు కొంగుచాటు కృష్ణుడిలాగా తెరచాటు రాజకీయం చేసిన ఆయన బావమరిది వైవీ సుబ్బారెడ్డి తెరమీదకు ఎంటర్ ది డ్రాగన్లాగా ఎంటరై... టీటీడీ బోర్డ్ చైర్మన్గా దేవదేవుడి సన్నిధిలోనే సేవ చేసుకొంటూ కూడా... చిత్తం, చూపులు అన్నీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల చుట్టూనే గిరా గిర్రా తిరుగుతోన్నాయని... ఆ క్రమంలో ఉన్నతాధికారుల పోస్టింగులు, బదిలీలు అన్నీ ఆయనగారి కనుసన్నల్లోనే జరుగుతోండడంతో.. బావగారి సున్నిత మనస్సు.. గట్టిగానే కందిపోయిందని... ఈ నేపథ్యంలో మూడు జల్లాల పార్టీ సమన్వయకర్త పోస్టింగ్కి బావగారు బాలినేని మంగళం పాడేశారని... దాంతో ఆ పంచాయతీ కాస్తా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వద్దకు చేరడం.. బాలినేనిని పిలిపించుకొని.. రాజీనామాకి దారి తీసిన పరిస్థితులు... ఆ క్రమంలో బావమరిదిగారు చేస్తున్న రాజకీయ చెదరంగంలో తనను ఓ చెద పురుగుని చేసేశారంటూ సాక్షాత్తూ పార్టీ అధినేత వైయస్ జగన్ ముందే బాలినేని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు ఓ చర్చ సైతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతోంది.
అయితే సీఎం జగన్తో జరిగిన భేటీలో మళ్లీ మూడు జిల్లాల పార్టీ సమన్వయకర్త బాధ్యతలు స్వీకరించాలంటూ పార్టీ అధినేత కోరినా బాలినేని సున్నితంగా తిరస్కరించినట్లుగా ఓ టాక్ వైరల్ అవుతోంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బామ్మర్థి వై వీ సుబ్బారెడ్డి రాజకీయానికి కత్తెర వేయాలని పార్టీ అధినేతను కోరినా అందుకు ముఖ్యమంత్రి జగన్ మిన్నకుండిపోయినట్లు సమాచారం. దీంతో చేసిది లేక.. బాలినేని సైలెంట్గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేశారని తెలుస్తోంది.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా.. అవి విఫలమవుతూనే వస్తున్నాయనే ఓ చర్చ సైతం ఫ్యాన్ పార్టీలో కొన.. సాగుతోంది. ఆయన ఉత్తరాంధ్ర ఇన్చార్జ్గా ఉండి కూడా పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని... అలాగే టీటీడీ చైర్మన్గా ఆయన హాయాంలో తిరుమలలో వరుసగా చోటు చేసుకొంటున్న పరిణామాల పట్ల భక్తులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే ఓ చర్చ ఒంగోలులోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా గట్టిగానే సాగుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా బావమరిది అంటే... బావా బతుకు కోరతాడంటారు... అంతే కానీ ఈ బామ్మర్ధి ఏంటీ.. బావగారి రాజకీయ భవిష్యత్తుకి గంట కొట్టి మంగళహరతులు ఇచ్చేసేలా వ్యవహరిస్తున్నారనే చర్చ ఒంగోలు నగరంలో కొన.. సాగుతోంది. ఏదీ ఏమైనా తమ్ముడు తమ్ముడే పేకాట పేకటే అన్నట్లుగా బామ్మర్థిగారి వ్యవహారం ఉందని అభిప్రాయం సైతం సదరు నగర ప్రజల్లో వ్యక్తమవుతోన్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dominant-politics-in-prakasham-39-155167.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.