Publish Date:Jan 31, 2025
ఉన్నత చదువుల కోసం ఎఫ్ 1 విసాపై అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తున్న తెలుగు విద్యార్థులు, యువకులు భయాందోళనకు లోనవుతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ నినాదం ఇపుడు ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగువారిపై తీవ్ర ప్రభావం చూపింది. చదువు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు దాదాపు 7 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడు వేల విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాలను పునరుద్దరించారు. రానున్న రోజుల్లో వీసా చట్టాలను మరింత కఠినతరం చేస్తామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఒక వేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. వీసాలు సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్ 1, రెండోది జె 1, మూడోది ఎం 1 . ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా నియామకమైన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఆయన ఉక్కు పాదం మోపారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు ఉద్యోగం దేవుడెరుగు కనీసం ఇక్కడ ఉండనిస్తే చాలు అనే స్టేజికి వచ్చేశారు. తమను ఎక్కడ దేశబహిష్కరణకు గురి చేస్తారోనని వణికిపోతున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేయడం ప్రారంభించారు. రిస్క్ తీసుకుని స్టూడెంట్ వీసాలు తీసుకున్న వారంతా ఇంటి బాట పట్టే పరిస్థితి నెలకొంది. వీరంతా ఎఫ్ 1 వీసాపై ఉన్నవారే. వారానికి 20 గంటలు మించి పార్ట్ టైం ఉద్యోగం చేయకూడదు. నిర్దేశిత స్థలంలోనే ఈ ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే దేశ బహిష్కారం తప్పదు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్ లు, రిటైల్ స్టోర్ ల్లో అక్రమంగా పని చేస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/does-not-want-a-job-in-america-39-192133.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది