వెస్ట్ బెంగాల్ ఎన్నికలు.. ముస్లిం వీటో అసలు ఉందా?

Publish Date:Apr 18, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఎక్కువ విశ్లేషణలు ఒకే వాక్యంతో మొదలవుతాయి.. అదేమిటంటే, ముస్లిం ఓటు కన్‌సాలిడేషన్‌.  అంటే, మైనారిటీ ఓటు 294 సీట్లలో 80–120 సీట్ల భవిష్యత్తు నిర్ణయిస్తుందనే వాదన. అయితే..   జనాభా గణాంకాలు, జిల్లా వారీ మ్యాప్ లు, గత ఎన్నికల మార్జిన్లు చూసినప్పుడు, ఈ కథనం   అతిశయోక్తిగా కనిపిస్తుంది. వాస్తవంగా పశ్చిమ బెంగాల్ లో ముస్లింల జనాభా  27 అయినప్పటికీ..  3 జిల్లాల్లోనే వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.  

 2011 జనగణన ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ముస్లింల జనాభా 27శాతం.  రాష్ట్రంలోని మొత్తం జిల్లాల్లో వారి జనాభా మెజారిటీగా ఉన్నది మూడు జిల్లాల్లోనే. అవి ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్ పూర్. వీటిలో ముర్షిదాబాద్ లో ముస్లింల జనాభా 66శాతంగా ఉంది. ఇక మాల్డా జిల్లాలో 51శాతం, ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో 50శాతంగా ఉంది.  

మిగతా 20 జిల్లాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ,   251 అసెంబ్లీ  సీట్లలో.. స్పష్టంగా హిందువుల మెజారిటీ ఉంది.  అంటే, రాష్ట్ర స్థాయిలో ముస్లింల జనాభా 27శాతం ఉన్నప్పటికీ..  భౌగోళికంగా అది కొన్ని బెల్ట్‌లలో కేంద్రీకృతమై ఉంది, మిగతా చోట్ల విస్తరించి, లేదా చీలిపోయిన రూపంలో ఉంది.

 80 సీట్లు ముస్లిం నిర్ణయిస్తారు అన్న గణితం ఎక్కడ తప్పిందంటే.. ఏ జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం దాటితే..  ఆ జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లను ముస్లిం ప్రభావిత సీట్లు గా లెక్కించడం. అలా లెక్కించడం వల్లే. ఇలా లెక్కిస్తే.. రాష్టరంలో 80కి పైగా సీట్లలో జయాపజయాలను ముస్లిం ఓటర్లు నిర్ణయిస్తారు.ఇదే.. ముస్లిం వీటో కథనానికి బేస్.

అయితే సమస్య ఎక్కడంటే.. అసెంబ్లీ ఎన్నికలు ఫస్ట్–పాస్ట్–ది–పోస్ట్ (ఎఫ్పిటీపీ) వ్యవస్థలో జరుగుతాయి. అంటే జిల్లాలో ముస్లిం జనాభా పాతిక శాతం  ఉన్న.. ప్రతి నియోజకవర్గంలోనూ  అదే స్థాయి కన్‌సాలిడేషన్ ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా  స్వతంత్రంగా నిర్ణయించే  స్థాయి ప్రభావం రావాలంటే.. ఒక సీటులో ముస్లిం ఓటు శాతం సాధారణంగా 38 నుంచి 40 శాతం ఉండాలి. అప్పుడు మాత్రమే  ఒకే బ్లాక్‌గా ఓటేస్తే, ఫలితాన్ని తిప్పే శక్తి వస్తుంది.  అంటే, జిల్లా స్థాయి శాతాన్ని నేరుగా సీటు స్థాయి ప్రభావంగా గణించడం సరికాదు. .

జిల్లాల వారీగా  ముస్లిం డిసెసివ్ సీట్లు ఏంటని చూస్తే..  ముర్షిదాబాద్ జిల్లాలో 22 స్థానాలు. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 66శాతం.  ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉన్న సీట్లు 20.  అలాగే మాల్డా జిల్లాను తీసుకుంటే.. ఇక్కడ ముస్లిం జనాభా 51శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 12. ముస్లిం ఓటు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు 8. ఇక నార్త్ దినాజ్ పూర్ జిల్లా విషయానికి వస్తే.. ఈ జిల్లాలో ముస్లిం జనాభా 50శాతం. జిల్లాలో మొత్తం సీట్లు 9. వీటిలో ముస్లిం ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే సీట్లు ఐదు. 
అలాగే బీర్భూమ్. దక్షిణ 24 పరగణాలు, నదియా. ఉత్తర 24 పరగణాలు జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో ముస్లిం కన్సాలిడేషన్ 38 నుంచి 40 శాతం వరకూ ఉంటుంది.  

 అవేంటని చూస్తే.. ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని 33 సీట్లలో 5 నుంచి ఏడు స్థానాలలో, దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని 31 స్థానాలలో 4 నుంచి 6 సీట్లలో ముస్లిం ఓటు డెసిసివ్ గా ఉంటుంది. మొత్తంగా ఈ జిల్లాలన్నీ కలిపి చూసినా  ముస్లిం ఓటు నిర్మాణాత్మకంగా ఉండే సీట్లు 47 నుంచి 54కు మించవు.  అంటే రాష్ట్రంలోని మొదత్తం 294 నియోజకవర్గాలలో కేవలం 16 నుంచి 18 శాతం సీట్లలో మాత్రమే ముస్లిం వీటో కాదుకాదు హెడ్ స్టార్ట్ ఉంటుందన్న మాట.  

ఇక్కడ ఒక   తేడా ఉంది.. అదేంటంటే.. ఒక పార్టీకి ఒక కమ్యూనిటీ నుంచి భారీ కన్‌సాలిడేషన్ వస్తే, ఆ పార్టీకి ఆ సీట్లలో స్పష్టమైన  ఆధిక్యం ఉంటుంది. అదే ఏ సీటులోనైనా ఏ కాంబినేషన్ వచ్చినా ఒక కమ్యూనిటీ అంగీకరించని పరిస్థితి ఉంటే ఎవరూ గెలవలేని స్థాయి ప్రభావం.. ఇదే వీటో.  బెంగాల్ లో ముస్లిం ఓటు కొన్ని బెల్ట్‌లలో హెడ్ స్టార్ట్ ఇస్తుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వీటో శక్తి ఇవ్వదు.  ఇకపోతే వేస్టెడ్ ఓటు సమస్య ఒకటి ఉంది. దీని వల్ల భారీ మెజారిటీలు వస్తాయి కానీ రాజకీయంగా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు భగబంగోలా సీటులో తృణమూల్ కాంగ్రెస్ కు లక్షా ఆరు వేల మెజారిటీ వచ్చింది. అలాగే సుజాపూర్ లో లక్షా ముఫ్పై వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ వచ్చింది. 

ఎఫ్పిటీపీ వ్యవస్థలో.. గెలవడానికి అవసరమైనది ఒక ఓటు ఎక్కువ మాత్రమే.     దాని మించి వచ్చిన ఓట్లన్నీ  సర్‌ప్లస్ మాత్రమే. అవేమీ ప్రాతినిథ్యాన్ని,  ప్రతినిధిత్వాన్ని పెంచవు. అంటే, ముస్లిం ఓటు భారీగా కన్‌సాలిడేట్ అయిన సీట్లలో.. TMC వంటి పార్టీలు అత్యధిక మెజారిటీలతో గెలుస్తాయి. అంతే.. కానీ ఆ అదనపు లక్షల ఓట్లు ఇతర సీట్లలోకి బదిలీ అవ్వవు.  రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు, ఇది ఒక స్ట్రక్చరల్ వేస్ట్ అంతే. 

ఇదే సమయంలో  TMCకి అత్యంత కీలకమైన 13 సీట్లలో ఆ పార్టీకి వచ్చిన మెజారిటీ మూడు వేల ఓట్ల కంటే తక్కువే.  ఇవేవీ ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాలు కావు.  అంటే..   ఎలక్షన్‌ను తిప్పిన సీట్లు ముస్లిం బెల్ట్‌లో కాకుండా, మిక్స్‌డ్ లేదా హిందూడామినేటెడ్ ప్రాంతాల్లోనే ఉన్నాయి.  
2021లో నిజంగా ఎక్కడ ఎన్నిక తేలింది? అంటే..  హౌరా, హూగ్లీ, మటువా బెల్ట్ లో ఇక్కడ ముస్లిం జనాభా తక్కువ.  కానీ ఇక్కడే రేజర్ థిన్ మార్చిన్లు వచ్చాయి.  మొత్తం 7 జిల్లాల్లో టీఎమ్సీ 50,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచింది, మిగతా అన్ని సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. అంటే.. ఎలక్షన్  లెక్క మేరకు ముస్లిం బెల్ట్‌లో భారీ మెజారిటీలు సురక్షిత సీట్లు. కానీ  వేస్ట్‌డ్ ఓట్లు. మిక్స్‌డ్ అండ్ హిందూ డామినెంట్ బెల్ట్‌లో చిన్న మార్జిన్లు. ఇవే అసలైన డిసెసివ్ బ్యాటిల్‌గ్రౌండ్స్. 

91 లక్షల డిలీషన్, సీటుకు 31,000 ఓట్లు: 2026లో కొత్త ఫ్యాక్టర్

ఇక మరో  కీలక అంశం ఏమిటంటే..  ఓట్ల తొలగింపు. వెస్ట్ బెంగాల్ లో మొత్తం  91 లక్షల ఓటు తొలగించారు.  అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు.  ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్.  మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో  టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?  ఏ సామాజిక సమూహం, ఏ పార్టీ సపోర్ట్ బేస్ ఎక్కువగా ప్రభావితమైంది? అన్నదే ఇప్పుడు 2026 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.  

 ముస్లిం కన్‌సాలిడేషన్ కంటే, ఓటర్ లిస్ట్‌లోని మార్పులు, మిక్స్‌డ్ బెల్ట్‌లలోని చిన్న మార్జిన్‌లు 2026లో ఎక్కువగా డిసెసివ్ అయ్యే అవకాశం ఉంది. ముస్లిం ఓటు వంద శాతం  దగ్గరగా కన్‌సాలిడేట్ అయితే.. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ఒక పార్టీకి 50 నుంచి 60 సీట్లు  సేఫ్  అవుతాయి. అదే సమయంలో మిగతా 234 సీట్లలో.. హిందూ ఓటు కూడా అదే స్థాయిలో కన్‌సాలిడేట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. అప్పుడు మొత్తం రాష్ట్ర ఎన్నికల లెక్క పూర్తిగా మారిపోతుంది. అంటే..  పోలరైజేషన్ ఒకే సమాజానికి  వీటో  ఇవ్వదు. అది రెండువైపులా పదునున్న కత్తిలా  పనిచేస్తుంది.ఇది కచ్చితంగా  ప్రతి ప్రధాన ఆటగాడికి లాభం చేకూరుస్తుంది.  

టీఎంసీ ముస్లిం ఓటు మా వెంట ఉంది. మేం సెక్యులరిజం కాపలాదారు అని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు.కరెప్షన్, గవర్నెన్స్, స్థానిక అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కమ్యూనల్ థ్రెట్ లో కవర్ చేసుకోవచ్చు.  ఇక బీజేపీ అయితే.. ముస్లిం బ్లాక్ ఓటు అంటూ హిందూ ఓటును మరింత కన్సాలిడేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది వీటో భయం, అపరాధ భావనను కలగలిపి పోలరైజేషన్ ను మరింత పెంచుతుంది.  ఇక ఐఎస్ఎఫ్ వంటివి ముస్లిం ఓటు మాచేతిలో ఉందంటూ పొలిటికల్ టెజిటమసీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి.  అంటే, డేటా చెప్పేది ఒకటి, రాజకీయ కథనం చెప్పేది మరోటి అన్న మాట.  అంతిమంగా తేలేదేంటంటే.. పశ్చిమ బెంగాల్ లో హెడ్ స్టార్ట్ ఉంది, వీటో లేదు.  డేటా, మ్యాప్, జిల్లాల వారీ శాతం, సీటు వారీ మార్జిన్ అన్నీ కలిపి చూసినా అదే తేలుతుంది. ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర్ దినాజ్‌పూర్, 24 పరగణాల కొన్ని బెల్ట్‌లలో ముస్లిం ఓటు ఒక పార్టీకి స్పష్టమైన హెడ్ స్టార్ట్ ఇస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 294 సీట్లలో, ముస్లిం ఓటు 80–120 సీట్లను  స్వతంత్రంగా  నిర్ణయించే స్థాయి  శక్తి కలిగి లేదు. వాస్తవ ఎన్నికల ఫలితాలు తేలేది.. మిక్స్‌డ్ బెల్ట్‌లలో, అలాగే.. చిన్న మార్జిన్ సీట్లలో. ఓటర్ లిస్ట్ మార్పులు, టర్నౌట్, లోకల్ ఇష్యూల కలయికలో. 


పశ్చిమ బెంగాల్ 2026 ఎన్నికలో   జిల్లాల వారీ డెమోగ్రఫీ, సీటు వారీ మార్జిన్, ఓటర్ లిస్ట్ మార్పులు, పోలరైజేషన్ రెండు వైపులా ఎలా పనిచేస్తుందో చూడాలి. అప్పుడు మాత్రమే, ఎవరు గెలుస్తారు? అన్న ప్రశ్న కంటే, ఎలా గెలుస్తారు?   అనే లోతైన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. 

సేకరణ, సంకలనం : సీతారాం కంఠంనేని 

By
en-us Political News

  
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.  
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.  
జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది. 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
ఎమ్మెల్సీగా వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 20) ప్రమాణ స్వీకారంచేశారు. మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు వర్ల రామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.