కాంగ్రెస్ గూటికి సునీత.. జగన్ కు ఇక దబిడిదిబిడే!

Publish Date:Jan 17, 2024

Advertisement

జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇచ్చారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఇలా ఏపీ పగ్గాలు అందుకున్నారో లేదో, అలా మరో చెల్లెలు అంటే గొడ్డలి పోటుకు బలైపోయిన సొంత చిన్నాన్న కుమార్తె డాక్టర్ సునీత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. ఇప్పటి వరకూ తన తండ్రి హత్యకు సూత్రధారులు, పాత్ర ధారులకు శిక్ష పడాలని న్యాయపోరాటం చేస్తున్న వైఎస్ సునీత ఇప్పుడు న్యాయపోరాటంతో పాటు ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టి చట్ట సభల్లో కూడా గొంతెత్తాలని నిర్ణయించుకున్నారు. అన్నిటికీ మించి తన తండ్రి హంతకులకు రక్షణ కవచంలా నిలిచి కాపాడుతున్న పెద్దనాన్న వైఎస్ కుమారుడు, ఏపీ సీఎం జగన్ పై రాజకీయ పోరాటానికి రెడీ అయ్యారు.   

వైఎస్ వివేకా హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఉన్నారు. 

అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు నత్తనడకకు కారణం ఎవరన్న దానిపై కూడా సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి.  కారకులెవరు? హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయం కోర్టులు ఇంకా తేల్చకపోయినా..  ప్రజలకు మాత్రం  క్లారిటీ  వచ్చేసింది.   రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో  ఎలాంటి అనుమానాలు కానీ, సందేహాలు కానీ లేవు. అయితే అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగడానికి  కారణం మాత్రం ఒకే ఒక్కరు. ఆమే  హతుడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం ఫలితంగానే వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంత వరకూ వచ్చింది.  

అలుపెరుగని షర్మిల పోరాట  ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగింది.  ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తున్న  పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.   అయితే జగన్ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేయడం, నిర్వీర్యం చేయడం ద్వారా కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేయడానికి చేయగలిగినంతా చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి రాగానే  కేంద్రదర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కేసును నిర్వీర్యం చేయడానికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎంతగా ప్రయత్నించిందన్న సంగతి.

కేవలం సునీత న్యాయపోరాటం కారణంగానే కేసు సీబీఐ చేతికి వెళ్లి .. రాష్ట్రం దాటి తెలంగాణలో విచారణకు వచ్చింది. ఇక్కడా కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వత్తాసుగా నిలిచింది. ఇందుకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరవ్వడాన్ని సమర్ధిస్తూ వీలైనప్పుడు వస్తారు? ఆయనేమైనా ఉగ్రవాదా? అంటూ మీడియా ముఖంగా  ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల మాటలే నిదర్శనం.  సరే అవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు డాక్టర్ సునీత కాంగ్రెస్ గూటికి చేరనుండటం మరొక ఎత్తు.  తండ్రి తమ్ముడిని, స్వయంగా తన సొంత బాబాయ్ని హత్య చేసిన వారిని సీఎం హోదాలో ఉన్న జగన్ కాపాడుతున్నారని తన న్యాయపోరాటం ద్వారా ఇప్పటికే ప్రజలకు తెలిసేలా చేసిన డాక్టర్ సునీత.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టడం ద్వారా బహిరంగ వేదికలపై జగన్ ప్రభుత్వ అకృత్యాలను, తన తండ్రి హంతకులను ఎలా కాపాడుతున్నారు వంటి అంశాలన్నిటినీ వివరించనున్నారు.  జగన్  సొంత చెల్లెలు సొంత అన్న జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నపై రాజకీయ పోరాటం ప్రారంభించేందుకు  రెడీ అయిన సమయంలో ఆమెకు మద్దతుగా  మరో చెల్లెలు, డాక్టర్ సునీత కాంగ్రెస్ గూటికి చేరనుండటం రాజకీయంగా చక్రం తిప్ప బోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.  

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.