Publish Date:Aug 12, 2022
ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం టీవీ సీరియల్ లా సా...గుతోంది. రోజుకో కుదుపు.. పూటకో మలుపులా ఈ కేసు విచారణ తీరు మారింది. సీబీఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించారు.
తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగాలని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ఆమె ప్రతివాదులుగా చేర్చారు. అత్యంత దారుణంగా, అమానవీయంగా జరిగిన తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.
2019 మార్చి 15న వివేకానందరెడ్డిని పులివెందులలోని తన నివాసంలోనే దారుణం హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఈ ఐదుగురి పేర్లు తెర మీదకు వచ్చినా.. వీరి వెనక సూత్రధారులు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగి మూడేన్నరేళ్లు పూర్తయినా ఇంకా దోషులెవరనేది తేలనే లేదు.
అయితే.. తన తండ్రి హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పట్టు వీడకుండా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే నిందితులు ఉల్టా కేసులు వేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ పై బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలతో విచారణ నత్తనడక నడుస్తోంది. దీంతో సునీతారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/doctor-sunita-file-pitition-in-supreme-on-probe-of-her-fathers-murder-case-39-141806.html
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.