పశువులు మెచ్చిన ప్రభువు ఎవరో తెలుసా ?

Publish Date:Jul 27, 2022

Advertisement

నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమే రానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. మళ్ళీ మనకు పొలిటికల్ కమేడియన్స్ అనగానే,ఒక కేఏ పాల్ లేదంటే ఆ రేంజ్ నాయకులు ఎవరో గుర్తొస్తారు కానీ, పాల్ ని మించిన కమేడియన్లు ఉన్నారని మనం గుర్తించలేక పోతున్నాం. దటీజ్ అవర్ బాడ్ లక్ ..  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్నే తీసుకోండి, ఆయన ఎంత చక్కగా నవ్వుతారు. నవ్వీ నవ్వనట్లుగా, అదో రకంగా భలేగా నవ్వుతారు. (గిట్టని వాళ్ళు ఆయన నవ్వు ముఖానికి పూసుకున్తున్నట్లు ఉంటుందంటారు అనుకోండి అదివేరే విషయం).

నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డికి జగన్ రెడ్డే సాటి.  అయన భలే భలే జోకులేస్తారు. నిజానికి అయన మాటే ఒక జోకు... అందుకే, నవ్వడంలోనే కాదు, నవ్వించడంలోనూ జగన్ రెడ్డి మంచి మార్కులే వచ్చాయని అంటారు.  మార్కులంటే  గుర్తొచ్చింది. మీరు ఒక పరీక్ష రాసారు, అనుకోండి, మీకు ఆ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి, ఫస్ట్ క్లాసొచ్చిందా? అసలు పాస్ మార్కులు అయినా వచ్చాయా, పాసయ్యారా?  లేదా, అనేది ఎవరు నిర్ధారించాలి, మీకు ఎవరు మార్కులు వేయాలి  ఆ పరీక్ష పేపర్ దిద్దిన మాష్టారు కదా, కానీ, జగన్ రెడ్డి స్కూల్ లో అలాకాదు. పరీక్ష ఆయనే రాస్తారు. మార్కులు ఆయనే వేసుకుంటారు. ఆయనకు ఆయనే సర్టిఫికేట్  కూడా ఇచ్చుకుంటారు.  ఆ మధ్యన ఆయన మీటలు నొక్కే టెస్టులో నేను ఫస్టు క్లాస్ లో పాసై పోయాను.

నాకు ప్రజలు (ఏ ప్రజలు అని అడగకండి) 80 శాతం మార్కులు వేశారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ చేశారు అని ఆయన జబ్బలు ఆయనే చరుచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ గోదావరి వరదలను ట్యాకిల్ చేయడంలోనూ, తనకు తానే సాటని మరో మారు జబ్బలు చర్చుకున్నారు. మనుష్యులే కాదు, పశువులు కూడా తనను చూసి తెగ మురిసి పోతున్నాయని చెప్పుకొచ్చారు. పశువులకు నోరు లేక కానీ, లేదంటే, ఓహో జగనన్న .. ఆహ జననన్న.. నువ్వే మా రాజన్న .. అంటూ కీర్తి గీతాలు ఆలపించేవని, తమ కీర్తిని తానే చాటు కున్నారు. చాటింపు వేసుకున్నారు. తమకు వరద సాయం అందలేదని ఒక్కరూ కూడా చెప్పలేదని .. అందర్నీ ప్రభుత్వం ఆదుకుందన్నారు, అంతే కాదు,  కట్టు బట్టలతో మిగిలిపోయిన, ప్రజలు, జగనన్న ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల రూపాయలు ఏమి చేసుకోవాలో తెలియక సంబరాలు చేస్కుంటున్నారనికూడా సంతోషంతో చిందులు వేశారు.

అంతే  కాదు, ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి చెప్పని మరో గొప్ప రహస్యాన్ని కూడా శ్రీ జగన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఆదేశాలు మాత్రమే ఇవ్వాలి కానీ, జనంలోకి రారాదని. వచ్చినా పరదాల చాటున, పోలీసుల మాటున రావాలే కానీ, కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించడం ముఖ్యమంత్రి చేయవలసిన పని కాదని , చాలా చక్కని సందేశం ఇచ్చారు.  అంటే ఏంటి, నవ్వడానికి అయినా నవ్వించడానికి అయినా, కమేడియన్లే కానక్కర లేదు, బ్రహ్మానందమేరానక్కర లేదు. రాజకీయ నాయకులు కూడా ఇంచక్కా, చక్కగా నవ్వించగలరు. నవ్వనూ గలరు. ఇన్ ఫాక్ట్’ ఇతర రాజకీయ నాయకుల సంగతి ఎలా ఆన్నా, ఏపీ సీఎం జగన్ రెడ్డి లో మాత్రం ఓ మాంచి కమెడియన్ కూడా ఉన్నారు. సరే, ఆయన నవ్వుల సంగతి ఎలా ఉన్నా, అయన నవ్వుల పాలవుతున్నారు.. అంటారా ..అది  మీ ఇష్టం

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.