డీయంకే తో దోస్తీ కత్తి మీద సామువంటిదే

Publish Date:Jun 29, 2013

Advertisement

 

తమిళ తంబిలతో వ్యవహారం కత్తి మీద సాము వంటిదని, వారికి కోపమొచ్చినా సంతోషం కలిగినా పట్టలేమని కాంగ్రెస్ పార్టీ నిశ్చితాభిప్రాయం సరైనదేనని, డీయంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చాలా సార్లు నిరూపించారు.

 

తనకు మద్దతు ఇస్తున్న పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ముద్దుల కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు అని కూడా చూడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కనిమోలిని 2జి స్కాం లో అరెస్ట్ చేయడమే కాక, పది నెలలు తీహార్ జైల్లో పెట్టి ఆమె చేత క్రోవ్వొత్తులు కూడా చేయించుకొన్నప్పుడు, ఆ కన్న తండ్రి హృదయం ఎంతగా రగిలిపోయుంటుందో కాంగ్రెస్ కి కూడా బాగా తెలుసు. అయితే రాష్ట్రంలో, పగబట్టిన పాములాంటి జయలలిత చేతిలో చిక్కి విలవిలలాడుతున్నందున, విధిలేని పరిస్థితుల్లో యుపీయేకు తన మద్దతు కొనసాగించవలసి వచ్చింది. తరువాత 2జీ స్పెషలిస్టులు కనిమోలి, రాజా ఇద్దరూ జైలు నుండి బెయిలుపై విడుదల కాగానే, శ్రీ లంక తమిళుల సమస్యను సాకుగా చూపించి, యుపీయేకు తన మద్దతు ఉపసంహరించి, మూడు చెరువుల నీళ్ళు తాగించాడా పెద్దాయన. అయితే, తండ్రిగా ఆయనపడిన ఆవేదనను అర్ధం చేసుకొన్న సోనియమ్మ మాత్రం డీయంకేతో దోస్తీ కొనసాగించాలని విశ్వప్రయత్నం చేసింది. అయితే ఆయన పేరుకి కరుణానిధి అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పై ఇసుమంత కరుణ చూపలేదు.

 

అంత మాత్రాన్న కాంగ్రెస్ కూడా నిరాశాపడిపోలేదు. ఆయన మనసులో చోటు సంపాదించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. మొన్న జరిగిన రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నికలలో కనిమోలికి ఐదు సీట్లు తక్కువబడటంతో, అదే అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆమెకు తన ఐదు ఓట్లు వేసి, ఆమెకు రాజ్యసభ సీటు మళ్ళీ దక్కేలా చేసింది. దానితో కటినాత్ముడనుకొన్న కరుణానిధి మనసు వెన్నపూసలా కరిగిపోయింది. అందుకు నిదర్శనంగా, ఆయన తన కుమార్తెను స్వయంగా డిల్లీ వెళ్లి సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పి, పనిలోపనిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి స్నేహగీతాలు పాడుకోవడానికి తమకు అభ్యంతరం లేదని సోనియమ్మ చెవిలో ఊది రమ్మని పంపారు. డిల్లీ వెళ్లి సోనియమ్మను కలిసి వచ్చిన కనిమోలి, తానూ కేవలం ‘థాంక్స్’ చెప్పడానికే ఇంత దూరం ఎగురుకొంటూ వచ్చానని మీడియాకు నమ్మబలుకుతున్నారు.

 

అయితే, కాంగ్రెస్ పార్టీ మొన్న బీహార్ లో నితీష్ కుమార్ కి కూడా ఇలాగే సహాయపడితే ఆయన జస్ట్ ఒక రెండు రూపాయలు పెట్టి ఒక ఫోన్ కాల్ చేసి థాంక్స్ చెప్పాడే తప్ప ఇలా ఇంత దూరం ఎగురుకు రాలేదు కదా? మరి కనిమోలి ఎందుకు అంత శ్రమపడింది? అంటూ మీడియావాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కారు

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.