జ‌గ‌న్ శిబిరంలో దివాక‌రం క‌ల‌క‌లం!

Publish Date:Apr 21, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ  వైసీపీ గ్రాఫ్   త‌గ్గిపోతోంది. 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో  అత్యధిక స్థానాలలో   వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం   క‌ష్టంగా మారింది. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల మార్పుతో పాటు,  వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు సైతం ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించేందుకు స్థానిక వైసీపీ నేత‌లు నానా తంటాలు ప‌డుతున్న ప‌రిస్థితి. ఇటీవ‌ల బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై రాయి దాడి ఘ‌ట‌న‌ను రాజ‌కీయంగా వాడుకునేందుకు వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల అనుభ‌వంతో ప్ర‌జ‌లు వైసీపీ కుట్ర‌ల‌ను తిప్పికొట్టారు. దీంతో స్థానిక తెలుగుదేశం నేత‌ల‌పై ఈ రాయి దాడి ఘ‌ట‌న‌ను నెట్టేందుకు పోలీసుల స‌హ‌కారంతో వైసీపీ నేత‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు. ఒకప‌క్క‌ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతోపాటు,  సానుభూతి కోసం వైసీపీ అధిష్టానం వేసిన ప్లాన్ సైతం బెడిసి కొట్టడంతో  వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. 


సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో.. అమ్మఒడి ఇచ్చాం.. బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లో డ‌బ్బులు వేశాం.. ప్ర‌తీనెలా ఇంటింటికి పెన్ష‌న్ డ‌బ్బులు అందిస్తున్నాం అంటూ గొప్ప‌గా చెబుతున్నారు. అభివృద్ధి అంటే రోడ్లు బాగుచేయ‌డం, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌టం, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం.. రాజ‌ధాని నిర్మాణం ఇవేమీ కాదు.. కేవ‌లం బ‌ట‌న్ నొక్క‌డం ఇంటింటికి డ‌బ్బులు ఇవ్వ‌డ‌మే అన్న‌ట్లుగా జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న సాగింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ నేను బ‌ట‌న్ నొక్కాను.. ఇంత‌క‌న్నా అభివృద్ధి ఏం కావాలి అన్న‌ట్లుగా    జ‌గ‌న్ ప్ర‌సంగిస్తున్నారు.  అయితే, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌ట‌న్ నొక్కుడు, డ‌బ్బులు ఇవ్వ‌డం వెనుక బండారాన్ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లోతెలుగుదేశం నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ప‌ది రూపాయిలు ఇచ్చి వెయ్యి రూపాయ‌ల‌ను ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ ఎలా లాక్కుంటున్నారో కూట‌మి నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. దీనికితోడు జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కుడు వెనుక అస‌లు బండారాన్ని బ‌య‌ట‌పెడుతూ తెలుగుదేశం దివాకరం అనే షార్ట్ ఫిల్మ్ ను రూపొందించింది. ఈ వీడియోలో జగన్ ప్రజల నుంచి ఎంత దోచుకుంటున్నారో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ దివాకరం షార్ట్ ఫిల్మ్ చర్చనీయాంశంగా మారింది. 

అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో, పన్నులు, ధరల పెంపు ద్వారా ఒక్కో కుటుంబంపై ఎంత భారం పడిందో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన దివాకరం షార్ట్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ది క్యాషియర్ అనే ట్యాగ్ లైన్ తో ఎనిమిది నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో వివిధ వర్గా ప్రజలలో ఆలోచన రేకెత్తిస్తోంది.  మద్యం తాగే ఒక్కో వ్యక్తి నుంచి అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఎంత దోచిందో.. మందు బాబు నోటితోనే చెప్పించారు. ఐదేళ్లలో మద్యం సేవించే ఒక్కో వ్యక్తి నుంచి రూ. 2.16లక్షలు దోచుకున్నారు.. నవరత్నాల పేరుతో కుటుంబానికి జగన్ ఇస్తుంది ఏడాది రూ. లక్ష.. కానీ పెట్రోల్, డీజిల్, ఇసుక ధరలు, బస్, విద్యుత్, ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్త పన్ను, రోడ్ ట్యాక్స్, పైబర్ నెట్ ఛార్జీలు పెంచి జగన్ ప్రభుత్వం   ప్రతి కుటుంబం నుంచి దోచుకుంటున్నది  పెంచినవన్నీ లెక్కేస్తే ఐదేళ్లలో ఒక్కో కుటుంబం నుంచి జగన్ సర్కార్ దోచింది అక్షరాలా రూ. 10లక్షలు అంటూ వీడియోలో లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. 

ఐదేళ్లలో జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోయారో పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ రూపొందించిన దివాకరం షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వైసీపీ అభ్యర్థులు ఈ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు నష్టపోయిన విధానాన్ని కుప్తంగా వీడియోలో వివరించడంతో ప్రజల్లో పార్టీపై మరింత వ్యతిరేకత పెరిగి తమ ఓటమికి కారణమవుతుందని వైసీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రచారానికి వెళ్తున్న పలువురు వైసీపీ అభ్యర్థులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ విడుదల చేసిన దివాకరం షార్ట్ ఫిల్మ్  ప్రజలలో వ్యతిరేకత మరింత పెంచిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-18
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.