తెలంగాణలో రాజకీయ పార్టీల వ్యూహాలకు, ఎన్నికల ప్రణాళికలకు ఆయా పార్టీలోని అసంతృప్తి వాదులు, అసమ్మతి వాదులే పెద్ద అవరోధంగా తయారయ్యారు.
రానున్న ఎన్నికలలో అన్ని పార్టీలూ రెబల్స్ బెదడను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార తెరాస, రాష్ట్రంలో బలోపేతమై తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగామని చెప్పుకుంటున్న బీజేపీ, రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఇలా మూడు పార్టీలలోనూ అసమ్మతి సెగలు రగులుతున్నాయి.
రాష్ట్రంలో మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు ఒకింత ఎక్కవగానే ఉన్నాయని చెప్పాలి. 2018 ఎన్నికల అనంతరం ఇరత పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు తలుపులు బార్లా తెరిచి తెరాస గూటిలో చేర్చుకోవడమే ఇప్పుడు ఆ పార్టీకి అసమ్మతి బెడద ఎక్కువగా ఉండటానికి కారణం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మొదటి నుంచీ పార్టీలో ఉండి గత ఎన్నికలలో పరాజయం అయిన వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలా తెరాసలో అసమ్మతి బెడద ఉన్న నియోజకవర్గాలు పదిహేనుకు పైగానే ఉన్నాయంటున్నారు పరిశీలకులు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో రానున్న ఎన్నికలలో తలనొప్పులు తప్పవని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో తెరాసకు దీటుగా బలోపేతం అయ్యామని చెప్పుకుంటున్న బీజేపీకి కూడా అసమ్మతి తలపోటులు తప్పడం లేదు. అభ్యర్థుల ఎంపిక సమయానికి ఈ బెడద మరింత ఎక్కువ అయ్యేలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గంలో అసమ్మతి బెడద ఎదుర్కొంటున్నారు. అలాగే బండి సంజయ్ తీరుతో ఆయన త్రిబుల్ ఆర్ గా అభివర్ణించిన ఈటల రాజేందర్, రఘునందనరావు, రాజాసింగ్ లే అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాల నుంచే సమాచారం అందుతోంది.
ఇక రాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ లో అసమ్మతి మరింత అధికంగా ఉంది. స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయినా కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి, తిరుగుబాట్ల బెడద లేకపోతే ఆశ్చర్యపోవాలి కానీ ఉన్నందుకు కాదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidents-in-all-parties-25-135329.html
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.