Publish Date:Jul 20, 2022
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు అసమ్మతి సెగ తగిలింది. ఆయన కేబినెట్ సహచరులే తిరుగుబావుటా ఎగురు వేశారు. యోగి మంత్రివర్గంలో ఇద్దరు తమ అసమ్మతిని బహిర్గతం చేశారు. యోగి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక మంత్రి రాజీనామా చేయగా, మరో మంత్రి పార్టీ హై కమాండ్ కు యోగి తీరుపై ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీకి చోట్ల అసమ్మతి ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ ఎక్కడా, ఎవరూ ఇలా బహిర్గతం కాలేదు.
బీజేపీ సీఎంలందరిలోనూ అత్యంత శక్తిమంతుడిగా భావించే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పైనే తిరుగుబావుటా ఎగురవేయడం యోగి తీరును విమర్శిస్తూ ఏకంగా ఒక మంత్రి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. ఉత్తర ప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి దినేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను దళితుడిని కావడం వల్లే సీఎం తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, వివక్ష చూపుతూ ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ దినేశ్ విమర్శించారు. దినేశ్ తన రాజీనామా లేఖను ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు పంపారు. చూపుతున్నారని, ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. దినేశ్ తన రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పంపారు.
దళితుడిని కనుకనే తన పట్ల వివక్ష చూపుతున్నారనీ, మంత్రిగా తనకు ఎటువంటి అధికారాలూ లేవనీ, గత వంద రోజులుగా తనకు ఎటువంటి పనీ అప్పగించలేదనీ, కనీసం అధికారిక కార్యక్రమాలకు సైతం ఆహ్వానం లేదనీ ఆయనా లేఖలో పేర్కొన్నారు. అలాగే యోగి కేబినెట్ లో మరో మంత్రి కూడా తన అసమ్మతిని బహిర్గతం చేశారు. ముఖ్యమంత్రి యోగి తీరుపై నేరుగా పార్టీ అధిష్ఠానానికే ఫిర్యాదు చేశారు.
అవినీతి ఆరోపణలపై యూపీ సర్కార్ ఇటీవల సస్పెండ్ చేసిన అధికారులలో రాష్ట్ర్ర ప్రజాపనుల శాఖ మంత్రి జితిన ప్రసాద పీఏ కూడా ఉన్నారు. దాంతో సీఎం యోగి జితిన ప్రసాదను మందలించారనీ, దీంతో ఆయన తీవ్ర ఆగ్ర్హహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు జితిన ప్రసాద ఫిర్యాదు చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. యోగి తీరు నియంతలా ఉందని, మంత్రులకు, ఎమ్మెల్యేలకూ కనీస గౌరవం దక్కడం లేదనీ జితిన ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disidence-in-yogi-cabinet-one-minister-resign-39-140204.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.