తెలంగాణ బీజేపీలో మరోసారి భగ్గుమన్న అసంతృప్తి!

Publish Date:Feb 15, 2025

Advertisement

తెలంగాణలో బీజేపీ అంతర్గత కుమ్ములాటలో కూనారిల్లుతోంది. ఆ పార్టీకి రాష్ట్రంలో బలం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఆ పార్టీ హైకమాండ్ కు మెండుగా ఉంది. అందుకే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. 

గత అసెంబ్లీ ఎన్నికలక ముందు కూడా ఆ పార్టీలో ఇక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడమే తరువాయి అన్నంత ధీమా వ్యక్తం అయ్యింది. అయితే ఎన్నికల సమయానికి పార్టీ చతికిల పడింది. కనీసం డబుల్ డిజిట్ స్థానాలు కూడా సాధించలేక చతికిల పడింది. అదే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మళ్లీ బలంగా పుంజుకున్నట్లు కనిపించింది. లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో సమానంగా స్దానాలను సాధించింది. ఇక అప్పటి నుంచీ 2028 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులు వేయడం మొదలెట్టింది. అయితే తెలంగాణలో బీజపీ పరిస్థితి బలపడినట్లు బలపడి ఒక్కసారిగా జావగారిపోవడంలా తయారైంది. ఈ పరిస్థితికి పార్టీలో అంతర్గత కుమ్ములాటలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
ఇప్పుడు అసలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్న తెలంగాణ బీజేపీకి కొత్త సమస్య వచ్చి పడింది. ఆ పార్టీ జిల్లాల అధ్యక్షుల నియామకం చేపట్టీపట్టగానే పార్టీలో అసంతృప్తి ఒక్క సారిగా భగ్గు మంది. 23 జిల్లాలకు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను నియమించింది.  
వాటిలో గోల్కొండ గోషామహల్ నియోజకవర్గ అధ్యక్షుడి ఎంపిక విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం  వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినాయకత్వంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ జిల్లా అధ్యక్షుడి నియామకంలో స్థానిక ఎమ్మెల్యే మాటకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం ద్వారా పార్టీ నాయకత్వం తనను అవమానించిందన్నారు. అంతే కాకుండా జిల్లాల అధ్యక్షుల ఎంపికలో పార్టీ హైకమాండ్ పారదర్శకత పాటించలేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి.. తన గుడ్ లుక్స్ లో ఉన్న ఒకరిద్దరి సలహాల మేరకు హైకమాండ్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. గోల్కొండ, ఘోషామహల్ జిల్లా పార్టీ ఇన్ చార్జిగా ఉమామహేంద్ర నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజా సింగ్ అయితే బయటపడి బాహాటంగా విమర్శలు గుప్పించారు. కానీ ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలలో జిల్లాల అధ్యక్షుల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, మొదటినుండి పార్టీ కోసమే కష్టపడినవారిని విస్మరించి, మధ్యలో వచ్చిన వారిని పార్టీ హైకమాండ్ అందలం అందిస్తోందని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గోల్కొండజిల్లా ఇన్ చార్జిగా బీజేపీ హైకమాండ్ నియమించిన ఉమామహేంద్రకు ఎంఐఎం నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయన్నది రాజాసింగ్ ఆరోపణ. తాను మొదటి నుంచీ ఏంఐఎంపై పోరాటం చేస్తున్నాననీ, ఇప్పటి జిల్లా అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ ఎంఐఎం నేతలకు సన్నిహితుడిగా మెలుగుతున్న వ్యక్తిని నియమించడం ఎంత వరకూ సబబని ప్రశ్నిస్తున్నారు.   దాదాపు ఇలాంటి ఫీలింగే పలు జిల్లాల అధ్యక్షుల విషయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలలో ఉంది. అయితే వారు బహిరంగంగా చెప్పడం లేదంతే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ ఒక్క విషయంలోనే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్రంలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలతో సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యమే. అలాగే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు అందరికీ తెలిసిన విషయమే.  ఎంపీలు, ఎంఎల్ఏల సిఫారసుల ప్రకారం కాకుండా తన మద్దతుదారులే జిల్లాల అధ్యక్షులుగా ఉండాలన్న కిషన్ ఆలోచన కారణంగానే చాలాచోట్ల వివాదాలు రేగుతున్నాయని పార్టీ వర్గాలే అంటున్నాయి.  

By
en-us Political News

  
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.