మెదడు బాగుండాలా? రెండు నిమిషాలు మౌనం పాటించండి!

Publish Date:Jul 10, 2017

Advertisement

నిశ్శబ్దానికి ఉన్న విలువ గురించి భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వేల సంవత్సరాల క్రితమే వారికి మౌనంలో దాగిన జ్ఞానం గురించి అవగాహన ఉంది. అందుకే మనసుని నిశ్చలంగా నిలిపి ఉంచే ధ్యానాన్ని కనిపెట్టారు. ‘ఊరికే అలా రాయిలాగా నిశ్చలంగా కూర్చుంటే ఏంటి ఉపయోగం? అంటూ ఒకప్పుడు గేలి చేసిన పాశ్చత్య ప్రపంచం కూడా ఇప్పుడు మౌనం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు.

మెదడు మరింత చురుగ్గా!
ఓ నాలుగు సంవత్సరాల క్రితం నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉంటే, మెదడుకి ఏమన్నా ఉపయోగం ఉందేమో కనుక్కోవాలన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడువుగా కొన్ని ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. రోజుకి రెండు గంటలపాటు ఎలుకలకి ఎలాంటి శబ్దమూ చేరకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఉండనిచ్చారు. దాంతో వాటి మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడటం చూసి పరిశోధకులు బిత్తరపోయారు. మన జ్ఞాపకాలు, ఉద్వేగాలు, నైపుణ్యాలను నియంత్రించడంలో ఈ హిప్పోకేంపస్‌ది ముఖ్యపాత్ర! అంటే నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండటం వల్ల మన మెదడు మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్నమాట.


సమస్య మరింత తేలికగా!
నిశ్శబ్దంలో ఉండటం లేదా మనసుని నిశ్చలంగా ఉంచుకోవడం వల్ల... సమస్యలని పరిష్కరించడం కూడా తేలికగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు అటూఇటూ పోకుండా నేరుగా సమస్య మీదే తన దృష్టిని కేంద్రీకరించేందుకు కావల్సిన స్వేచ్ఛ దొరుకుతుందట. సరికొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే అవకాశమూ దక్కుతుంది. మెదడుని అలా నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తే, అసలు ఆలోచనలే ఉండవు కదా! అన్న అనుమానం రావచ్చు. మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా, మనం ఏ సమస్యనైతే మెదడుకి అందించామో.... దాన్ని విశ్లేషిస్తూనే ఉంటుంది.


శబ్దంతో ఒత్తిడి
ఇప్పటివరకూ నిశ్శబ్దం గురించి చెప్పుకొన్నాం కాబట్టి, ఇప్పుడు శబ్దం వల్ల ఏర్పడే ఫలితం కూడా ఓసారి చూద్దాం. చుట్టూ అదేపనిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటే శరీరం, ఒత్తిడిని కలిగించే రసాయనాలను (stress hormones)ను విడుదల చేస్తుందని తేలింది. గాఢ నిద్రలో ఉన్నా కూడా పక్కనే వినిపించే శబ్దాలకు మెదడు కంగారుపడుతూనే ఉంటుందట. నిరంతరం రణగొణధ్వనుల మధ్య ఉండే పిల్లల్ని గమనించినప్పుడు.... ఆ శబ్దాలు వారి చదువు, ఎదుగుదల, తెలివితేటల మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఆ శబ్దాలకు అలవాటుపడిన పిల్లలు ఆఖరికి ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో కూడా విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట!

 

ఏతావాతా... నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయడం, మనమూ మౌనంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేలిపోయింది! అందుకే రెండు నిమిషాల పాటు మంచి సంగీతాన్ని విన్నప్పుడు కలిగే హాయికంటే, రెండు నిమిషాల పాటు మౌనంగా ఉన్నప్పుడ పొందే ప్రశాంతతే ఎక్కువని తేల్చారు పరిశోధకులు.

By
en-us Political News

  
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు..
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు...
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.