ఖమ్మం బీఆర్ఎస్ లో గందరగోళం

Publish Date:Apr 3, 2025

Advertisement

అధికారం పోయినా కొనసాగుతున్న వర్గపోరు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ లో  ముఠాల పోరు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది..అధికారం పోయినా నాయకుల్లో ఐక్యత కనిపించడం లేదు… కొన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు అడ్రెస్ లేకుండా పోయారు.. సత్తుపల్లి, పాలేరు మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై పని చేస్తున్నారు. మధిరలో మాజీ జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అప్పుడప్పుడు తాను ఉన్నానని నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హైదరాబాద్ లో ఉంటూ ఏదైనా పార్టీ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో మాత్రమే వచ్చి పాల్గొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో అక్కడ పార్టీకి ఎవరూ దిక్కు లేకుండా పోయారు. అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు కొద్దోగొప్పో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో గతంలో వర్గపోరుతో అధికార అభ్యర్థిని ఓడించి ఇండిపెండెంట్ ను గెలిపించారు. ఈసారి సిటింగ్ ఎమ్మెల్యే ను కాదని మాజీ ఎమ్మెల్యే మనల్ లాల్ కు టికెట్ ఇచ్చారు. దీంతో ఓవర్గం వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఇప్పటికీ అక్కడ అదే పరిస్థితి కొనసాగుతోంది. 

కొత్తగూడెం లో పార్టీలో ముఠా కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇంచార్జ్ వనమా వెంకటేశ్వరావు ను మార్చాలనే డిమాండ్ ఎన్నికల ముందు నుంచి ఉంది. దీని పర్యవసానమే అక్కడ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వనమా మూడో స్థానానికి పరిమితమయ్యారు. పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం హల్ చల్ చేశారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.. ఖమ్మంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా మంత్రి అజయ్ కుమార్ అండ చూసుకొని కొందరు కార్పొరేటర్లు చేసిన దందాల వల్ల జరిగిన నష్టం ఇంకా పార్టీని వెంటాడుతూనే ఉన్నది. అధిష్ఠానం కూడా జిల్లాలో ఉన్న కుమ్ములాటలను అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు. దాని పర్యవసానంగా జిల్లాలో రెండు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది. 2014 నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో ఆ పార్టీ ఒక్కసీటునే గెలిచింది.. 2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావ్, 2018లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్, 2023లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు.

2018 ఎన్నికల్లో ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకొని బలమైన నాయకులు కూడా ఓడిపోయారు. ఆతరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. చివరకు 2023 ఎన్నికల్లో వారిద్దరికీ పార్టీ టికెట్లు నిరాకరించింది. దాంతో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రులు అయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో బలమైన నాయకత్వం లేదు. ఉమ్మడి జిల్లాలో కిందిస్థాయి నాయకులను ఒక్క తాటిపైకి తీసుకువచ్చే నాయకులు లేరు. దీంతో అధికారం లేకపోవడం నాయకుల మధ్య సమన్వయం కొరవడటం వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొంటోంది. కొందరు నాయకులు మాత్రం తమ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.