కమలంలో లుకలుకలు!

Publish Date:Jul 5, 2022

Advertisement

నిజం. బీజేపీలో జోష్ పెరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతగా నిర్వహించడమే కాకుండా.. బహిరంగ సభను ఆ స్థాయిలో సక్సెస్ చేయడంతో  పార్టీ జాతీయ  నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం పై విశ్వాసం మరింతగా పెరిగింది. ముఖ్యంగా బహిరంగ సభ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందనికానీ, అంత పెద్ద ఎత్తున జనసమీకరణ సాధ్యమవుతుందని కానీ, ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీ పెద్దలు ఎవరూ ఉహించలేదు. అందుకే, ప్రధాని నరేంద్ర మోడీ, ఉబ్బి తబ్బిబై పోయారు. వేదిక మీదనే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ను భుజం తట్టి మరీ అభినందించారు. 

అయితే, ఇప్పడు ఆ అభినందనే పార్టీలో లుకలుకలు సృష్టించిందా, అంటే, అవుననే అంటున్నారు పార్టీ పెద్దలు, పరిశీలకులు.నిజానికి బీజేపీలో గత కొంత కాలంగా సంజయ్ కేంద్రంగా అప్పుడప్పుడు లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. అలాగే, పాత కొత్త నాయకుల వివాదం కూడా ఎప్పటినుంచో వుంది. ఆ కారణంగానే నాగం జనార్ధన రెడ్డి, మొత్కుపల్లి నరసింహులు ఎక్కువకాలం పార్టీలో ఉండలేక పోయారు. మరోవంక పార్టీలో కొనసాగుతున్న బయటి నేతల్లోనూ అసంతృప్తి అప్పుడప్పుడు బయట పడుతూనే వుంది.  దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు అయితే, సంజయ్ వ్యవహార శైలిపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తపరిచారు. అలాగే, పార్టీలో పాత కాపులు కొత్తగా చేరిన నాయకుల మధ్య రోజురోజుకు దూరం రుగుతోందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. 

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్’ కూడా ఒకటి రెండు సందర్భాలలో ఈ విషయంలో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్త పరిచారు.ఎంతోకాలంగా పార్టీలో ఉన్న నాయకులకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య సహజంగానే కొంత వ్యత్యాసం ఉంటుంది. అందులోనూ భావజాల పునాదులపై నిర్మాణమైన పార్టీలో ఇలాంటి దూరం ఇంకొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే. పార్టీ ఎదగాలన్నా, ఎన్నికల్లో గెలవలన్నా, క్షేత్ర స్థాయిలో పట్టున్న నాయకులకు కలుపుకు పోవడం అవసరమని ఈటల గతంలోనే బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

 అయితే, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా, అంతకు ముందు కూడా పార్టీ జాతీయ నాయకత్వం ఈటల ఇవ్వవలసిన గౌరవం ఇచ్చిందని, పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులకు ఇచ్చిన గౌరవమే ఈటలకు ఇస్తోంది పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, రాజకీయ తీర్మానంలో భాగంగా తెలంగాణ రాజకీయ పరిస్తితులపై  ప్రసంగించే అవకాశం, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్’ కు ఇచ్చారని, అలాగే, బహిరంగ్ సభలో అవకాశం కూడా ఈటలలకు దక్కిందని అంటున్నారు.  

అదలా ఉంటే, అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ..ఇప్పడు బండి సంజయ్ ని ప్రధాని మోడీ అభినందించడం దేనికి సంకేతం అనే చర్చమొదలైంది. మరో వంక ఎన్నికలు ఎప్పుదు వచ్చినా విజయం బీజేపీదే, అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపధ్యంలో, ‘నిజ్జంగానే’ బీజేపే అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. నిజానికి గతంలోనూ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో హోం మంత్రి అమిత్ షా.. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోడీ అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని సంజయ్ సామర్ధ్యంపై విశ్వాసం ప్రకటించారు . ఇప్పడు, మోడీ మరింత ఉత్సాహంగా భుజం తట్టడంతో మరోసారి పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనే విషయంలో చర్చ మొదలైనట్లు తెలుస్తోంది. 

అయితే పార్టీ సీనియర్ నాయకులు మాత్రం, బీజేపీలో నాయకుల మధ్య పోటీ ఉంటుంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్ధి ఎవరన్న విషయంలో పార్టీలో చాలా  పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ, అప్పటి ప్రతిపక్ష నేత   సుష్మా స్వరాజ్ సహా చాలా మంది నేతలు పోటీ పడ్డారు. చివరకు పార్టీ మోడీ పేరు ఖరారు చేసిన తర్వాత, అక్కడక్కడ లుకలుకలు వినిపిచినా, పార్టీ అనూహ్య విజయం సాధించడంతో, అందరూ సర్దుకు పోయారని గుర్తు చేస్తున్నారు.  అదే విధంగా, తాజాగా మహారాష్టలో మాజే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌’ను కాదని శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్’నాథ్ షిండే’కు అవకాశం ఇచ్చిన విషయాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

బీజేపీ సన్యాసుల మఠం కాదు.పార్టీ నాయకులకు పదవుల మీద ఆశలు ఉండవు అని అనలేము. ఎవరైనా అలా అనుకుంటే అది ఆత్మ వంచనే అవుతుందని, అయితే వ్యక్తిగత పదవుల కంటే పార్టీకి, పార్టీ కంటే దేశానికీ పెద్ద పీట వేయడం(దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తీ లాస్ట్) నేతలు ఫాలో అవుతారని పార్టీ సీనియర్ నాయకులు  అంటున్నారు.

అయితే, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ అనవసరమని, సమయం వచ్చినప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం ఆ విషయం  చూసుకుంటుందని అంటున్నారు. అలాగే, ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎవరు? అనేంత వరకు వెళితే, అది మొదటికే మోసం అవుతుందని అంటున్నారు. అయితే, పార్టీలో  లుకలుకలు అయితే మొదలయ్యాయి, అందులో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.