ఒకే వర లో రెండు కత్తులు.. విశాఖ సౌత్ లో కూటమి నేతల మధ్య విభేదాలు

Publish Date:Mar 4, 2026

Advertisement

విశాఖలో ఒకే వర లో రెండు కత్తులు అన్న రీతిన కూటమి నాయకుల వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో తెలుగుదేశం, జనసేన నాయకులు మధ్య పొత్తు సక్రమంగా లేదన్న మాట  బహిరంగంగా వినినిపిస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈ దశలో జీవీఎంసీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు  వీరంతా విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక  సమయంలో ఒక రకంగా పార్టీని ఫిరాయించారు అయితే ఈ కార్పొరేటర్లు అనుకున్న రీతిన కూటమి ధర్మాన్ని పాటించడం లేదు  దీనికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అధినాయకులు కారణం. నిజానికి ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన సీతం  రాజు సుధాకర్ ఉన్నారు ఈయన వెంట వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో తోపాటు టిడిపి కార్పొరేటర్లు కొందరు ఉన్నారు అదే సమయంలో  వైసీపీ నుంచి  జనసేనకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట కూడా కొందరు కార్పొరేటర్లు ఉంటున్నారు వీరందరూ కూడా తమతమ నాయకులకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు.   ఈ తరహాలో పార్టీ సభ్యత్వం నుంచి ఇతర వ్యవహారాల్లో కూడా తలో దిక్కు అడుగులు వేయడంతో కూటమి మధ్య సయోధ్య కరవైంది.  

 సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ  కొనసాగుతున్నది.  సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు.  ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కార్పొరేటర్ల పదవీకాలం మరొక రెండు వారాల్లో ముగుస్తోంది.  వీరిలో కొందరు నేరుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసి కూటమిలో కొనసాగుతుంటే... మరి కొందరు ఇండిపెండెంట్ లు వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతుగా నిలిచారు.  అయితే తమ పదవీకాలం ముగిసిన తర్వాత వార్డుల్లో ఏ తీరున వ్యవహరిస్తారన్న విషయం అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి పార్టీ సింబల్ పై తమకు సీట్లు కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు అయితే మేయర్ సీటు కోసం పార్టీ వీడి వచ్చిన తమకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీటు కావాలని ఇతరులు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో  నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో అని త్వరలో మాజీలు కాబోతున్న కార్పొరేటర్లు కలవర పడుతున్నారు.

ముఖ్యంగా సీతం రాజు సుధాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కూటమి కార్పొరేటర్లు కలవర పడుతున్నారు మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ  పాలకమండలి విషయంలో కూడా నాయకులకు అన్యాయం జరిగినట్టు  లో లోపల మధనపడుతున్నారు.   కూటమి ధర్మానికి భిన్నంగా ఈ నాయకుల వ్యవహారం ఉండటం కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరుగుతోంది.  ఈ పరిస్థితుల మధ్య ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిస్థితి ఒక రకంగా ఒక ఒరలో రెండు కత్తుల సమెతలా తయారైంది.   నిజానికి వైసీపీ నుంచి సీటు ఆశించిన సీతారామరాజు సుధాకర్,   వైసిపి  ఎమ్మెల్యే  అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడంలో కీలకంగా వ్యవహ రించారు. అంతమాత్రాన అతనికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి కార్పొరేటర్లకు అన్యాయం చేయలేమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. అదే సమయంలో సుధాకర్ కూడా అసలు తన ప్రమేయం లేకపోతే జనసేనకు ఇక్కడ అవకాశం ఉండదని అంటున్నారు. నాయకులు వాదన ఏ రకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉందని కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మదన పడుతున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.