రాష్ట్ర విభజనకు జగన్ సంపూర్ణ మద్దతు పలికారా?

Publish Date:Oct 17, 2022

Advertisement

వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విశాఖ గర్జన తుస్సు మంది. డ్వాక్రా మహిళలు, వర్సిటీ విద్యార్థులను బెదరించి బలవంతంగా తీసుకువచ్చినా.. విశాఖ జనంలో స్పందన లేకపోవడంతో గర్జన శబ్దం కనీసంగా కూడా విశాఖలో వినిపించలేదు. చివరికి సభలో చెప్పుకోదగ్గ జనం కూడా లేకుండా పోయారు. ఇంతోటి దానికి ఇంత మంది మంత్రులు తరలి రావాలా అన్న వ్యాఖ్యలూ వినిపించాయి. సరే ఇదంతా పక్కన పెడితే.. విజయసాయి గర్జన్ లో అసలు కనిపించలేదు, వినిపించలేదు.

ఆయన ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే వైసీపీ ఇంతటి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేసింది. వాస్తవానికి విశాఖ రాజధాని అయితే అందరి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరేది విజయసాయికే. ఆ లబ్ధి కోసమే ఆయన ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో ఎడాపెడా భూ దందాలు చేశారు. అవన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పార్టీ ఉద్దేశ పూర్వకంగానే ఆయనను విశాఖ బాధ్యతల నుంచి తప్పించిందంటారు. అందులో వాస్తవం ఎలా ఉన్నా.. విజయసాయి కుమార్తె, అల్లుడి ఖాతాలోకి విజయసాయి విజయవంతంగా చేర్చిన భూముల జాబితా మీడియా ముఖంగా సర్వే నంబర్లతో సహా వెలుగులోనికి వస్తుండటంతో ఆయన ఫేస్ విశాఖలో కనబడినా వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని స్వయంగా జగనే భయపడుతున్నట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే విజయసాయిని పార్టీ వ్యవహారాల నుంచి దూరంగా ఉంచాలన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. విశాఖ భూదందా, ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు అన్నీ విజయసాయి కేంద్రంగానే ఉండటంతో.. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో జగన్ సతీమణి భారతి పేరు బయటకు రావడం వెనుకా విజయసాయి సెల్ఫ్ ప్రొటక్షన్ వ్యూహం ఉందని జగన్ అనుమానిస్తున్నారని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే విజయసాయి భూదందా వ్యవహారాలన్నీ ఒకదాని వెనుక ఒకటి మీడియా ముఖంగా బయటపడుతున్నా... వైసీపీ బాకా ఉదే జగన్ సొంత పత్రికలో కనీసం ఖండనలు కూడా రాలేదని అంటున్నారు.

పార్టీ తనను దూరం పెడుతున్నదన్న నిర్ణయానికి వచ్చిన తరువాతనే విజయసాయి సొంత చానెల్ అంటూ ప్రకటించారనీ.. నిజానికి వైసీపీలో ఆయనకు మరింత ఉక్కపోత ఎదురైతే సొంత పార్టీ పెట్టేందుకు కూడా వెనుకాడరనీ అంటున్నారు. జగన్ ను ఢీ కొట్టేందుకు కూడా వెనుకాడని ధైర్యం విజయసాయికి రావడం వెనుక కమలం ఆశీస్సులున్నాయా అన్న అనుమానాలు సైతం వ్యక్త మౌతున్నాయి. బీజేపీ ఆశీస్సులు విజయసాయికి పుష్కలంగా ఉండటం వల్లనే ఇంత జరుగుతున్నా జగన్ ఆయనపై వేటు వేయడానికి కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేయడానికి కానీ వెనుకాడుతున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ విజయసాయిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అంటున్నారు. ఈ ధీమాతోనే.. రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే తరుణంలో నాడు జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయం వెల్లడయ్యేలా విజయసాయి కాంగ్రెస్ ను రెచ్చగొడుతూ ట్వీట్ చేశారని కూడా పరిశీలకులు అంటున్నారు. సరిగ్గా రాహుల్ భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించే సమయంలో జగన్ రాష్ట్ర విభజనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారంటూ.. నాడు వైసీపీ తీర్మానం చేయడాన్ని... ఆ తీర్మానాన్ని అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు పంపుతూ వైసీపీ పంపిన లేఖను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాంరమేష్ ఇప్పుడు వెల్లడించడానికి కారణం విజయసాయి చేసిన ట్వీటే కారణం కావడం గమనార్హం. 

By
en-us Political News

  
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.