వెంకయ్యను డబుల్ ఇంజిన్ బుల్ డోజ్ చేసిందా?

Publish Date:Aug 11, 2022

Advertisement

ఎంతటి గొప్పవారినైనా అట్టడుగుకు నెట్టేయడం, ఎంతటి అనామకులైనా అమాంతం అందలం ఎక్కించడంలో డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయానిది అందెవేసిన చేయి. దేశంలో బీజేపీని బతికి బట్టకట్టించేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ రథయాత్ర చేసిన ఆ పార్టీ ఒకప్పటి అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీని, ఆ పార్టీ కోసమే తమ సర్వ శక్తియుక్తులను ధార పోసిన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, దివంగత సుష్మా స్వరాజ్ లాంటి వారికి ఈ డబుల్ ఇంజిన్ ఏమాత్రం ప్రాధాన్యం కల్పించలేదనేది జగమెరిగిన సత్యం. వీరి కోవలోకే తాజాగా పదహారణాల మన తెలుగుబిడ్డ,  తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తారు.

 ఇంత కాలం అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం అయితే.. వెంకయ్య నాయుడిని దేశ ప్రథమ పౌరుడిని చేయాల్సి వస్తుంది. లేదంటే జాకీర్ హుస్సేన్ కు అవకాశం ఇచ్చినట్లు రెండోసారైనా వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగించి ఉండాల్సిందనే అభిప్రాయం ప్రతి తెలుగువాడిలోనూ ఉంది. విద్యార్థి దశ నుంచీ ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని, ఆనక బీజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడికి బలవంతపు విశ్రాంతి ఇవ్వడంతో మోడీ- షా ద్వయం రాజనీతి  ఔచిత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు పోషించిన పాత్ర మరిచిపోలేనిది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడికి వాజ్ పేయి కేబినెట్ లో సమాచార ప్రసారశాఖ, రవాణా శాఖ లాంటివి ఇస్తానంటే అవి వద్దని, తనకు వ్యవసాయశాఖ కావాలని అడగగలిగిన మనిషి వెంకయ్య నాయుడు. మోడీ హయాంలో పట్టణాభివృద్ధిశాఖ అప్పగించినప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తనకు పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసునని అనగలిగిన వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు. అయినప్పటికీ ఆయనకు పట్టణాభివృద్ధి శాఖనే మోడీ కేటాయించడం ప్రధాని మోడీ వ్యక్తిత్వం. అలా తనకు ఇష్టమైన శాఖ కాకుండా వేరే శాఖ ఇచ్చినప్పటికీ అత్యంత చాకచక్యంతో దాన్ని నిర్వహించి మెప్పించిన వ్యక్తి మన వెంకయ్య నాయుడు.

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత వెంకయ్య నాయుడు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు.. ఆయనలో ఏ మూలనో దాగి ఉన్న అసంతృప్తిని వెల్లడించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడు ఆ అసంతృప్తిని ఇసుమంతైనా బైట పడనివ్వని తీరు ఆయన హుందాతనానికి నిదర్శనం.  కనుక అసంతృప్తిని ఏ మాత్రం బహిర్గతం కానివ్వని తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది. ప్రధాని, లేదా రాష్ట్రపతి పదవికి పూర్తి అర్హతలున్న ఎల్కే అద్వానీ కూడా ఇలాగే పెద్దమనిషిలా వ్యవహరించారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంకయ్య నాయుడు తనదైన శైలిలో చాకచక్యంగా పరిష్కరిస్తారనే పేరు ఉంది. అలాంటి వెంకయ్య నాయుడు మీడియా చిట్ చాట్ లో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడుదేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

మళ్లీ తాను రాజకీయాల్లోకి రానని విస్పష్టంగా చెప్పిన వెంకయ్య, క్రియాశీలకంగా ఉండడం మాత్రం మానుకోనని  స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానన్నారు. తన దృష్టికి వచ్చే అంశాలను ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగానే వెంకయ్య నాయుడు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ‘పుస్తకం రాస్తే.. వాస్తవాలు రాయాలి.. బతికున్నవారి గురించి యథార్థాలు రాస్తే.. అనర్థాలు వస్తాయి’ అని ఆయన చమత్కారంగా అన్నా ఆ మాటల వెనుక నర్మగర్భంగా, నిగూఢంగా ఒకరిపై వేసిన చురకలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ గా చివరిరోజు వెంకయ్య నాయుడి కళ్లు చెమ్మగిల్లడం దేశం యావత్తు గమనించింది. కొన్ని సందర్భాల్లో ఆయన కర్ఛీఫ్ తో కళ్లు తుడుచుకున్న దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారం అయ్యాయి.

మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయాననే బాధ ఏ మాత్రం లేదని చెప్పడం గమనార్హం. తాను ఏదీ కోరుకోకపోయినా.. దేవుడి దయ, పెద్దల అభిమానం వల్ల అన్నీ లభించాయని చెప్పడంలో వెంకయ్య నాయుడిలోని పెద్దమనిషి తత్వం స్పష్టం అవుతోందంటున్నారు. అపూర్వ శక్తి గలిగి, రోజుకు 14 గంటలు పనిచేసే మోడీకి కూడా ‘అప్పడప్పుడూ నవ్వుతూ ఉండాల’ని, ‘అవసరమైనంత నిద్రపోవాల’ని సూచించగల చనువున్న వ్యక్తి వెంకయ్యనాయుడు. అలాంటి వెంకయ్యనాయుడిని మోడీ- షా ద్వయం ఎందుకు ఇలా దారుణంగా పక్కన పెట్టేసిందని మిలియన్ డాలర్ల ప్రశ్నగా వస్తోంది.

By
en-us Political News

  
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.
సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అంటే కమలం పార్టీ మెంటార్ ఆర్ఎస్ఎస్ ఔననే అంటోంది.
ఏపీలో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. త‌ప్పుల‌మీద త‌ప్పులు చేస్తున్న‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎన్నిక‌లవేళ షాక్‌ల‌మీద షాక్‌లు త‌గులుతున్నాయి. అధికారంలో ఉన్న‌న్ని రోజులు అధికారులను సొంత పార్టీ కార్య‌క‌ర్త‌లుగా మార్చిన జ‌గ‌న్‌, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న తీరు మార్చుకో లేదు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
ఏడు దశలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం (ఏప్రిల్ 19) ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలైంది.
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే.
బీజేపీతో రహస్య బందంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం (ఏప్రిల్ 19) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో ఏడు కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.