ఆయన శకుని... ఈయన శ్రీకృష్ణుడు...అయినా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్....

Publish Date:Mar 29, 2020

Advertisement

ఇది ఇద్దరు మిత్రుల కథ. . స్నేహానికి విలువిచ్చే రెండు ఉన్నత వ్యక్తిత్వాల ఆవిష్కరణ. ఎన్ఠీఆర్ లోని ఆత్మీయ కోణాన్ని, ఎన్ఠీఆర్ పట్ల  ధూళిపాళ కున్న భ్రాతృ ప్రేమను ఒకే సారి చూసిన ఆయన సన్నిహితుల మాటల్లో.. మీరే చదవండి.. ధూళిపాళ సీతారామ శాస్త్రి. పరిచయం అక్కర్లేని ఈ పేరు గురించి కానీ, ఈయన వ్యక్తిత్వం గురించి కానీ, ఈ రోజు మాత్రమే ప్రస్తావించటానికి ప్రధానమైన కారణం అయితే ఒకటి ఉంది. దివంగత ఎన్ టీ ఆర్ కు ఆత్మీయుడైన ధూళిపాళ తెలుగుదేశం ఆవిర్భావానికి పూర్వం చేసిన కృషి గురించి నందమూరి తారక రాముడి తో సన్నిహిత సంబంధం ఉన్న అతి కొద్దీ మందికి మాత్రమే తెలుసు. పార్టీ రాజ్యాంగం రాసే ముందు, ఎన్నో సందర్భాల్లో ఎన్ టీ ఆర్, ధూళిపాళ తో చాలా కీలకమైన అంశాల మీద చర్చించి, ఆయన సలహాలు తీసుకునే వారు. పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అనే పధకానికి తుది రూపు తీసుకొచ్చింది ధూళిపాళే అనే విషయం తామిద్దరి మధ్యనే ఉండాలని ఆయన, ఎన్ టీ ఆర్ దగ్గర మాట తీసుకున్నారు. శిఖర సమాన వ్యక్తిత్వమున్న ధూళిపాళ అంటే అందుకే, ఎన్ టీ ఆర్ కు విపరీతమైన అభిమానం, అలాగే స్నేహానికి ప్రాణమిచ్చి, నటుడిగా తనకు నలుదిక్కులా పేరు ప్రఖ్యాతులు తీసుకురావటానికి ఎన్ టీ ఆర్ చూపిన విశేషమైన ప్రేమాభిమానాలను ధూళిపాళ తరచూ గుర్తుచేసుకునే వారు. 

వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎలాంటిదంటే, ఎన్ టీ ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, తొలిసారి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నప్పుడు, అయన అందరికన్నా ముందర వాకబు చేసింది...ధూళిపాళ గారు ఎక్కడ అని.. బిత్తరపోయిన ఎన్ టీ ఆర్ అభిమానులు ధూళిపాళ కోసం ఎయిర్ పోర్ట్ లో వెతుకుతుంటే, ఎన్ టీ ఆరె నేరుగా ఎయిర్పోర్టు విజిటర్స్ గ్యాలరీ లో కూర్చుని ఉన్న ధూళిపాళ వద్దకు వెళ్లి , ఆయనకు పాద నమస్కారం చేసి, హృదయానికి హత్తుకున్నారు. అదీ ఆ ఇద్దరి మిత్రుల కథ. ఎన్ఠీఆర్ పదవీ చ్యుతుడై, తెలుగుదేశం పార్టీ సంక్షోభం లోకి వెళ్లిన సమయం లో -ఆయనకు మోరల్ సపోర్ట్ గా నిలబడ్డారు ధూళిపాళ. ఆ సమయం లో ఎన్ఠీఆర్ కు, ఆయనకు మధ్య నడిచిన సంభాషణలను దగ్గర నుంచి పరిశీలించిన అత్యంత సన్నిహితులు, ధూళిపాళకు, ఎన్ఠీఆర్ కు ఉన్న బంధం ..ఏకోదరుల బంధంకన్నా ఎక్కువే అని చెప్పుకునే వారు. ఎన్ఠీఆర్ మరణం తో తాను ఏకాకినయ్యానని చెప్పుకున్న ధూళిపాళ తర్వాతి రోజుల్లో సన్యాసాశ్రమం తీసుకుని, పూర్తిగా హనుమంతుడి సేవకు అంకితమైపోయారు. 

ఇహ, ధూళిపాళ సీతారామ శాస్త్రి సినీ రంగ ప్రవేశం ముందు సంగతికి వస్తే, గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు. దివికేగిన ఆ ఇద్దరి మిత్రుల మధుర స్మృతికి తెలుగు వన్ వినమ్రపూర్వక నివాళులు.

 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.